Mana News, Internet Desk :- వాషింగ్టన్: స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. బైడెన్ ప్రభుత్వం కావాలనే నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి తిరిగి రావడాన్ని ఆలస్యం చేసిందని ఆయన ఆరోపించారు.తమ సంస్థ రెస్క్యూ మిషన్ ను నెలల క్రితమే ప్రతిపాదించినప్పటికీ, ప్రభుత్వం పట్టించుకోలేదని మస్క్ విమర్శించారు.X (ట్విట్టర్) వేదికగా మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఎనిమిది రోజుల మిషన్ కోసం వెళ్లిన వ్యోమగాములు, వైట్ హౌస్ జోక్యంతో ఎనిమిది నెలలకు పైగా కక్ష్యలోనే చిక్కుకుపోయారని ఆయన పేర్కొన్నారు. “స్పేస్‌ఎక్స్ మరో డ్రాగన్‌ను పంపి, 6 నెలల క్రితమే వారిని తిరిగి తీసుకురాగలిగేది. కానీ బైడెన్ వైట్ హౌస్ దానిని అనుమతించలేదు” అని మస్క్ ఆరోపించారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకుని, వారిని వెంటనే తిరిగి రప్పించాలని ఒత్తిడి చేశారని మస్క్ తెలిపారు. సునీతా విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ బోయింగ్ స్టార్‌లైనర్‌లో జూన్ 6, 2024 న ISS కి చేరుకున్నారు. అయితే, ఆ వ్యోమనౌక తిరిగి ప్రవేశించడానికి సురక్షితం కాదని నాసా నిర్ధారించడంతో వారి తిరుగు ప్రయాణం నిరవధికంగా వాయిదా పడింది. ప్రస్తుతం, వారు స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్‌లో తిరిగి రానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *