ఎండియు వాహనాలు కొనసాగించాలని డ్రైవర్ల ఆందోళన

గొల్లప్రోలు మే 24 మన న్యూస్ :– రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీకి వినియోగించే ఎండియు వాహనాలను తొలగించడంపై డ్రైవర్లు గురువారం గొల్లప్రోలు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు.
ఎండియు వాహనాలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై గొల్లప్రోలు పట్టణ,మండల పరిధిలో డ్రైవర్లు వాహనాలతో సహా స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్ణయంపై డ్రైవర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం వైసీపీ ఇన్చార్జ్,మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ధర్నా చేస్తున్న డ్రైవర్ల వద్దకు వెళ్లి సంఘీభావం తెలిపారు. కొంతసేపు ఆమె డ్రైవర్లతో ఆందోళనలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు భద్రత కల్పిస్తే కూటమి ప్రభుత్వం ఏదో వంకతో తొలగించడమే పనిగా పెట్టుకుందన్నారు.ఎండియు వాహనాలు రద్దు పరచడంతో రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల రేషన్ పంపిణీ వాహనదారుల కుటుంబాలను రోడ్డున పడ్డాయన్నారు.ఎండియు డ్రైవర్లుగా అధిక శాతం బడుగు,బలహీన వర్గాలు వారే పనిచేస్తున్నారని వారి పొట్ట కొట్టే విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తక్షణం వెనక్కి తీసుకోవాలని గీత డిమాండ్ చేశారు.ఎటువంటి నోటీసులు, ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎండియు వాహనాలను తొలగించామంటూ ప్రభుత్వం ప్రకటన చేయటం దారుణమన్నారు.వేల కుటుంబాలు జీవనాధారం కోల్పోతున్నందున వాహన డ్రైవర్ ల తొలగింపు చర్యలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మైనం రాజా, వైసిపి నాయకులు గండ్రేటి శ్రీరామచంద్రమూర్తి, అముజూరి రాంబాబు,డ్రైవర్లు బుల్లి వెంకన్న, శ్రీనివాస్, వెంకటస్వామి,బాబీ,శివ,శ్రీను నాగేశ్వరరావు,సత్యనారాయణ, వసంతరావు,దానియేలు, వెంకటకృష్ణ,లక్ష్మణ్,రామకృష్ణ, బుల్లియ,పలువురు వైసిపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌ను నోరు మెదపకుండా చేసిన భారత్..!

Mana News :- పాకిస్తాన్‌ను మరోసారి ఐక్యరాజ్యసమితిలో నోరు మెదపకుండా చేసింది భారతదేశం. జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పదే పదే లేవనెత్తడం వల్ల ప్రపంచం ముందు అవమానాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అయినప్పటికీ తన కార్యకలాపాలను ఆపాడంలేదు. జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడుతూనే…

మారిషస్ దేశ జాతీయ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ..

Mana News :- ప్రధాని నరేంద్రమోడీ మారిషస్ దేశ పర్యటనకు వెళ్తున్నారు. మార్చి 12న జరిగే ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మంగళవారం నుంచి రెండు రోజులు పాటు ఈ పర్యటన జరుగుతుంది. రెండు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి