మామిడి రైతుకు ₹260 కోట్లు విడుదల పట్ల హర్షంసత్వరం రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయాలిగుజ్జు ఫ్యాక్టరీలు, రాంపులు బకాయలు చెల్లించాలిఏపీ రైతు సంఘం, మామిడి సంక్షేమ సంఘం విజ్ఞప్తి..

మన న్యూస్ తవణంపల్లి జూలై-19 రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మామిడి రైతులకు ప్రభుత్వ సబ్సిడీగా ₹4చొప్పున 260 కోట్లు నేడు విడుదల చేయడం హర్ష నీయమని ఏపీ రైతు సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా/టీ.జనార్ధన్ కార్యదర్శి కె . మునిరత్నం నాయుడు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం తవనంపల్లి లో ప్రపంచ మామిడి దినోత్సవ సందర్భంగా 22వ తేదీన జరుగు మహాజన సభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సబ్సిడీతో పాటు గుజ్జు ఫ్యాక్టరీ యజమానులు, రాంపుల నిర్వాహకులు చెల్లించాల్సి₹8 ప్రభుత్వమే చొరవ తీసుకొని రైతుల అకౌంట్ లో ₹520 కోట్లు జమ చేసేందుకు పూనుకోవాలని వారు కోరారు. గతంలో గుజ్జు యజమానులు తెలిపిన విధంగా స్టాకు మిగిలిపోవడం, డిమాండు లేకపోవడం వంటి మాటలు బూటకమని నేడు రుజువుతోందని వారు పేర్కొన్నారు. అదే నిజమైతే నేడు ₹8 నుండి ₹10 చెల్లించేందుకు ఎలా ముందుకు వస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధి ప్రదర్శించి ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు, చంద్రమౌళి రెడ్డి, మోహన్ రెడ్డి , శరత్, రామచంద్ర రెడ్డి బాబురెడ్డి, చిట్టెమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఎల్బీనగర్లో ప్రమాదం

ఎల్బీనగర్లో ప్రమాదం

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ