శ్రీ ఉమామహేశ్వరాలయంలో వైభవంగా మట్టెద్దుల అమావాస్య వేడుకలు,భక్తులకు అన్నదానం.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మట్టెద్దుల అమావాస్య పర్వదినం సందర్భంగా మక్తల్ పట్టణంలోని ఆజాద్ నగర్ లో వెలిసిన శ్రీ ఉమామహేశ్వరాలయం లో అమావాస్య వేడుకలు వైభవంగా జరిగాయి. బుధవారం అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు సిద్దరామయ్య స్వామి,మహేష్ స్వామి ఆధ్వర్యంలో తెల్లవారుజామున 4 గంటల నుండి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు .ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి వారికి అభిషేకాలు చేయించి మొక్కలు చెల్లించుకున్నారు. అభిషేకం విశేష పూజలు అనంతరం స్వామివారికి విశేష అలంకరణ గావించారు .అలంకరణ అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలను నిర్వహించారు. తదుపరి మహా మంగళహారతి అనంతరం కొత్తకాపు అంబిక రాఘవేందర్ రెడ్డి దంపతులు అన్నదాన కర్తలుగా వ్యవహరించి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిన్న కృష్ణయ్య ,పోలేపల్లి అనంత కుమార్, బి. శ్రీనివాసులు,వాకిటి అంజయ్య , జానమొల్ల పాపిరెడ్డి, నవీన్ , పి .నాగరాజు, పెద్ద వెంకటయ్య,వంశీ ,రవి ,ప్రవీణ్ ,గుడిగండ్ల నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయస్వామి దేవాలయం, శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయం వద్ద గ్రామ దేవత శ్రీ మారెమ్మ దేవాలయం వద్ద కూడా అన్నదాన కార్యక్రమాలు కొనసాగాయి.

Related Posts

ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి..ఎంఈఓ అమర్ సింగ్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జూన్ 25: మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలను బుధవారం ఎంఈఓ అమర్ సింగ్ పరిశీలించారు.ఈ సందర్భంగా పాఠశాల రికార్డులను పరిశీలించి, ప్రధానోపాధ్యాయుడు సాయి రెడ్డిని విద్యా బోధన, నిర్వహణ వివరాలను…

దుర్వాసనను భరించలేకపోతున్నాం… పట్టించుకోని అధికారులు.

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని మంజీరా పాత బ్రిడ్జి పక్కన డంపింగ్ యార్డ్ లా తలపిస్తుంది. నిజాంసాగర్ పిట్లం రహదారి పక్కన చెత్త రోడ్డుమీద పడటంతో నిత్యం దుర్వాసనను తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహనదారులు ప్రజలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

జిల్లా సర్వసభ్య సమావేశం విజయవంతం చేయండి..

జిల్లా సర్వసభ్య సమావేశం విజయవంతం చేయండి..

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థులు శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ కి ఎంపిక…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థులు శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ కి ఎంపిక…

సీఎం సహాయ నిధి చెక్కులను – ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పంపిణీ

సీఎం సహాయ నిధి చెక్కులను – ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పంపిణీ

ఏలేశ్వరం పట్టణంలో చినుకు పడితే చెరువే.

ఏలేశ్వరం పట్టణంలో చినుకు పడితే చెరువే.

అతిసార వ్యాధి నిరోధక అవగాహన కార్యక్రమం

అతిసార వ్యాధి నిరోధక అవగాహన కార్యక్రమం

అయ్యా పంచాయతీ సారూ… మా కులాయి మాకు ఇప్పించండి, అంటూ ఉదయగిరిలోని ఆవుల వీధి, వారు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…

అయ్యా పంచాయతీ సారూ… మా కులాయి మాకు ఇప్పించండి, అంటూ ఉదయగిరిలోని ఆవుల వీధి, వారు   వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…