లోకేష్ పై ఫేక్ ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు

మన న్యూస్ సాలూరు జూన్ 14 := పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు, 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలో తల్లికి వందనం డబ్బులు పడ్డాయని మంత్రి సంధ్యారాణి తెలియజేశారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేసి పుస్తకాలు, బూట్లు, బ్యాగులను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకంలో నాణ్యమైన కిట్లను అందజేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 42 లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి ఇచ్చారన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 67 లక్షల మంది విద్యార్థుల కు తల్లికి వందనం డబ్బులు జమ అయ్యావని అన్నారు. 82 లక్షల మంది విద్యార్థులు ఉంటే 67 లక్షల మందికి తల్లికి వందనం ఇవ్వడం ఏంటని వైసీపీ ప్రభుత్వం విమర్శలు చేస్తుందని అన్నారు. 82 లక్షల మంది విద్యార్థుల్లో అంగన్వాడి ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఉంటారని తెలుసుకోకుండా వైసీపీ నాయకులు విమర్శలు చేయడం తగదని పత్రికా ముఖంగా హెచ్చరించారు. 2 వేలు నుండి 3 వేలు పించను ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వానికి ఐదేళ్లు పట్టిందన్నారు. అదే కూటమి ప్రభుత్వం 3 వేలు నుండి ఒకేసారి 4 వేలు పెంచి గత మూడు నెలల పింఛను కూడా ఒకేసారి అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం మాదిరిగా దిష్టిబొమ్మ ఫోటోలు ఉండవన్నారు. వాటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం రాజముద్ర ఉంటుందన్నారు. వైసిపి పాలనలో రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిపోయినప్పటికీ ప్రధానమంత్రి మోడీ, పవన్ అండదండలతో చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్ పి బంజ్దేవ్, ఏఎంసి చైర్మన్ ముఖి సూర్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్, మక్కువ అధ్యక్షుడు గొల్ల వేణు, మెంటాడ అధ్యక్షుడు వెంకటరమణ, కౌన్సిలర్ హర్షవర్ధన్, పప్పల మోహన్ రావు ,యుగంధర్ ,బృందావనం అశోక్ ,విక్రమ శ్రీను, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

మత్తు మరియు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి : డా.డి సునీత ప్రిన్సిపల్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవంను జాతీయ సేవ పథకం ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా.డి…

జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష లో మెరిసిన వెంగంపల్లె విద్యార్థిని నక్కల ఝాన్సీ రెడ్డి

మన న్యూస్ తవణంపల్లె జూన్-26 మండలంలోని అరగొండలో గల అపోలో ఇషా విద్యాలయంలో చదువుతున్న వెంగంపల్లె కు చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి నక్కల హేమభూషన్ రెడ్డి కుమార్తె నక్కల ఝాన్షి రెడ్డి పీఎం జవహర్ నవోదయ విద్యాలయ సమితి నిర్వహించిన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

మత్తు మరియు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి : డా.డి సునీత ప్రిన్సిపల్

మత్తు మరియు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి : డా.డి సునీత  ప్రిన్సిపల్

జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష లో మెరిసిన వెంగంపల్లె విద్యార్థిని నక్కల ఝాన్సీ రెడ్డి

జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష లో మెరిసిన వెంగంపల్లె విద్యార్థిని నక్కల ఝాన్సీ రెడ్డి

ఆర్థిక ఇబ్బందుల్లో 1962 సిబ్బందినెలల తరబడి జీతాలు రాక

ఆర్థిక ఇబ్బందుల్లో 1962 సిబ్బందినెలల తరబడి జీతాలు రాక

తెలుగుదేశం పార్టీ నాయకుడిని పరామర్శించిన యువ నాయకుడు పైనేని మురళి

తెలుగుదేశం పార్టీ నాయకుడిని పరామర్శించిన యువ నాయకుడు పైనేని మురళి

వెన్న శివ ఆధ్వర్యంలో వరుపుల సాయి తర్సిత్ పుట్టినరోజు వేడుకలు…

వెన్న శివ ఆధ్వర్యంలో  వరుపుల సాయి తర్సిత్ పుట్టినరోజు వేడుకలు…

జిల్లా సర్వసభ్య సమావేశం విజయవంతం చేయండి..

జిల్లా సర్వసభ్య సమావేశం విజయవంతం చేయండి..