మన న్యూస్ సాలూరు జూన్ 14 := పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు, 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలో తల్లికి వందనం డబ్బులు పడ్డాయని మంత్రి సంధ్యారాణి తెలియజేశారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేసి పుస్తకాలు, బూట్లు, బ్యాగులను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకంలో నాణ్యమైన కిట్లను అందజేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 42 లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి ఇచ్చారన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 67 లక్షల మంది విద్యార్థుల కు తల్లికి వందనం డబ్బులు జమ అయ్యావని అన్నారు. 82 లక్షల మంది విద్యార్థులు ఉంటే 67 లక్షల మందికి తల్లికి వందనం ఇవ్వడం ఏంటని వైసీపీ ప్రభుత్వం విమర్శలు చేస్తుందని అన్నారు. 82 లక్షల మంది విద్యార్థుల్లో అంగన్వాడి ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఉంటారని తెలుసుకోకుండా వైసీపీ నాయకులు విమర్శలు చేయడం తగదని పత్రికా ముఖంగా హెచ్చరించారు. 2 వేలు నుండి 3 వేలు పించను ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వానికి ఐదేళ్లు పట్టిందన్నారు. అదే కూటమి ప్రభుత్వం 3 వేలు నుండి ఒకేసారి 4 వేలు పెంచి గత మూడు నెలల పింఛను కూడా ఒకేసారి అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం మాదిరిగా దిష్టిబొమ్మ ఫోటోలు ఉండవన్నారు. వాటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం రాజముద్ర ఉంటుందన్నారు. వైసిపి పాలనలో రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిపోయినప్పటికీ ప్రధానమంత్రి మోడీ, పవన్ అండదండలతో చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్ పి బంజ్దేవ్, ఏఎంసి చైర్మన్ ముఖి సూర్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్, మక్కువ అధ్యక్షుడు గొల్ల వేణు, మెంటాడ అధ్యక్షుడు వెంకటరమణ, కౌన్సిలర్ హర్షవర్ధన్, పప్పల మోహన్ రావు ,యుగంధర్ ,బృందావనం అశోక్ ,విక్రమ శ్రీను, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.