

మన న్యూస్ పాచిపెంట జూన్ 14: పార్వతిపురం మన్యం జిల్లా జిల్లాపాచిపెంట మండలంలో ఏజెన్సీ లో నూరు శాతం ఉద్యోగాలు గిరిజనులకే చెందాలని. జీవో నెంబ ర్ 3 పైన. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని గిరిజనులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పాచిపెంట మండలం పెద చీపురు వలస కోష్టు వలస జంక్షన్ల వద్ద ఆదివాసి గిరిజన సంఘం సిహెచ్ జగన్నాథం మంచాల గంగరాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది జీవో నెంబర్ 3 పునరుద్ధరణ చేయకపోవడం గిరిజనులు పాలిట శాపంగా మారిందని ఉద్యోగ భద్రత లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతోందని ఇప్పటికైనా ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేసి జీవో నెంబర్ మూడును కొనసాగించాలని ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి అన్ని పోస్టులు గిరిజనులకే చందాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం గిరిజన చట్టాలను మార్పుచేసి కార్పొరేట్లకు అడవులను కొండలను ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పచెప్తుంటే కూటమి ప్రభుత్వం కేంద్ర బిజెపి ప్రభుత్వానికి అండగా ఉంటూ గిరిజనులను నిర్వీర్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో. గిరిజలంతా ఐక్యంగా మెగా డీఎస్సీ నుంచి ఏజెన్సీ టీచర్ పోస్టులు మినహాయించాలని ఏజెన్సీ స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని జీవో నెంబర్ 3 ప్రకారము నూటికి నూరు శాతం గిరిజనకే ఉద్యోగ భద్రత కల్పించాలని ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ హక్కుల చట్టాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం అడవుల నుండి గిరిజనులను నెట్టి వేయడమే తప్ప మరో మార్గం లేదని 2005 సంవత్సరం అటువకుల చట్టం ప్రకారం ప్రతి గిరిజన కుటుంబానికి పది ఎకరాలు చొప్పున పట్టాలు ఇవ్వాలని ఉన్న కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం గిరిజనులకు ద్రోహం చేయడమేనని అన్నారు. అటువాకుల చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వకుండా సాగులో ఉన్నటువంటి భూములకు 5 ఎకరాలు సాగులో ఉంటే 50 సెంట్లు ఎకరం 20 సెంట్లు అలా తక్కువ పట్టాలు ఇవ్వడం గిరిజనులకు ద్రోహం చేయడమేనని అన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో భూములన్ని అన్యాక్రాంతం అయ్యాయని సాగు చేస్తున్న భూములకు పూర్తిస్థాయిలో పట్టాలు మంజూరు చేయకపోవడం భూములు అన్ని కూడా అన్యాక్రాంతమవుతున్నాయని అనేక సందర్భాల్లో అధికారులకు తెలియజేసిన పట్టించుకోకపోవడం వలన గిరిజనులు పేదలు నష్టపోయారని అన్నారు. జీవో నెంబర్ 3 పైన గిరిజన చట్టాల పైన స్పష్టమైన హామీ మంత్రి సంధ్యారాణి ఇవ్వాలని.ఇచ్చిందట హామీలు అమలు చేయాలని వన్ బై సెవెంటీ చట్టం పీసా చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని నాన్ షెడ్యూల్ గ్రామాలను షెడ్యూల్ గ్రామాల్లో చేర్చి గిరిజనులకు రక్షణ కల్పించాలని కోరారు. ప్రతి ఆశ్రమ పాఠశాలకి రెగ్యులర్గా ఒక ఏఎన్ఎం ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గిరిజనులు యువకులు పాల్గొన్నారు.