12 గంటల వ్యవధిలో మిస్సింగ్ కేసును ఛేదించిన ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మీకాంతం,పోలీస్ సిబ్బంది

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్:
ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన నిస్సి గోల్డ్ అనే 15 సంవత్సరాలువయస్సు గల అమ్మాయి ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు కనిపించకుండా పోయినట్లు,గుర్తించిన ఆమె తల్లిదండ్రులు,బంధువులు చుట్టూ ప్రక్కల వెతికినా ఆచూకి దొరకకపోవడంతో వారి తల్లిదండ్రులు ఈ నెల 13వ తేదీ రాత్రి 10 గంటలకు ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.బాధితుల ఫిర్యాదు మేరకు బాలిక మిస్సింగ్ అయినట్లు ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి వెంటనే ప్రత్తిపాడు సిఐ సూర్య అప్పారావు ఆధ్వర్యంలో ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మీకాంతం వారి సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తనిఖీ చేపట్టారు.మిస్సింగ్ అయిన అమ్మాయిని అత్యంత చాకచక్యంగా కేసు నమోదు అయిన 12 గంటల వ్యవధిలో అమ్మాయి ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకి అప్పగించారు.మిస్సింగ్ అమ్మాయి కేసును అతి తక్కువ సమయంలో ట్రేస్ చేసి వారి తల్లిదండ్రులకు అప్పగించడంలో కృషి చేసిన ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మి కాంతంను మరియు వారి సిబ్బందిని డిఎస్పీ,సిఐలతో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..