సరకల్లులో సీసీ రోడ్డును ప్రారంభించి ఎమ్మెల్యేలు మురళీమోహన్, అమరనాథ్ రెడ్డి..

మన న్యూస్ తవణంపల్లె జూన్-6

పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం, సరకల్లు బీసీకాలనీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ప్రారంభించారు. శుక్రవారం సీసీ రోడ్డు ప్రారంభోత్సవంలో భాగంగా బీసీ కాలనీకి చేరుకున్న పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ కి మరియు పలమనేరు శాసనసభ్యులు యన్.అమరనాథ్ రెడ్డి కి స్ధానిక నాయకులు పూలమాలు, దుశ్శాలువతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం సరకల్లు‌ బీసీ కాలనీ నుండి శ్మశానవాటిక వరకూ 13 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యేల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అనంతరం గ్రామస్తులతో సమావేశమైన ఎమ్మెల్యే మురళీమోహన్ స్ధానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ… గ్రామాల అభివృద్ధి కళ్లతో చూసేలా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రతి పల్లె బలపడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే విశ్వాసంతో ప్రతి గ్రామంలో మౌళిక వసతులపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగా, ప్రజల మాటను గౌరవించే ప్రభుత్వంగా పని చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిఎన్టియూసీ కార్యదర్శి యువరాజు నాయుడు, రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, తవణంపల్లి మండల టిడిపి అధ్యక్షులు గాలి దిలీప్ కుమార్ నాయుడు, పూతలపట్టు మండల అధ్యక్షులు దొరబాబు చౌదరి, ఐరాల మండల అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు, బంగారుపాలెం మండల అధ్యక్షులు ఎన్.పి. ధరణి నాయుడు, బంగారుపాలెం మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ నాయుడు, తవణంపల్లి క్లస్టర్ ఇంచార్జ్ సునీల్ చౌదరి, యాదమరి క్లస్టర్ ఇంచార్జ్ చిత్రానాయుడు, ఐరాల జడ్పిటిసి సుచిత్ర కన్నయ్య నాయుడు, మాజీ జడ్పిటిసి లతా బాబు నాయుడు, కాణిపాకం మాజీ ఆలయ చైర్మన్ మణి నాయుడు, మాజీ పూతలపట్టు మండల అధ్యక్షులు చంద్రమౌళి, టిడిపి సీనియర్ నాయకులు రఘురాం చౌదరి, ప్రవీణ్ కుమార్ నాయుడు, తవణంపల్లి మండల మహిళా అధ్యక్షురాలు చిట్టెమ్మ, సరుకలు సర్పంచ్ కత్తి సతీష్ రెడ్డి మరియు మండల నాయకులు, కార్యకర్తలు, వ్యవసాయ శాఖ‌ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Related Posts

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

గొల్లప్రోలు జూన్ 8 మన న్యూస్ : ఏ పి ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ఏర్పాటు జరిగినట్లు సొసైటీ జనరల్ సెక్రటరీ, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కనిగిరి వెంకట రంగారావు ఒక ప్రకటన లొ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి