ఆమాస ‘ కు శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేత భువన్ కుమార్ రెడ్డి

మన న్యూస్, తిరుపతి, :
చిత్తూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా బుధవారం అమాస రాజశేఖర్ రెడ్డి చిత్తూరులోని ఆ బ్యాంకు కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అమాస రాజశేఖర్ రెడ్డిని తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ పి భువన్ కుమార్ రెడ్డి శాలువతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భువన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అమాస రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో సహకార కేంద్ర బ్యాంకు రైతులకు వ్యవసాయ రుణాలను ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో చిత్తూరు సహకార బ్యాంకు ఆధ్వర్యంలో రుణాలు విరివిగా అందజేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అమాస రాజశేఖర్ రెడ్డి మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని భువన్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. అమాస రాజశేఖర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన వారిలో తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ వైస్ చైర్మన్ ఆనంద్ బాబు యాదవ్ కూడా ఉన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 6 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు