చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో పరిపాలన…టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి…

మన న్యూస్,తిరుపతి, జూన్ 04 :– ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంతో శరవేగంగా ముందుకు దూసుకెళ్తోందని టిడిపి నేత, తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ పి భువన్ కుమార్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. టిడిపి, బిజెపి, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి భువన్ కుమార్ రెడ్డి తో పాటు టౌన్ బ్యాంకు మాజీ వైస్ చైర్మన్ ఆనంద్ బాబు యాదవ్ లు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు పి. భువన్ కుమార్ రెడ్డి , ఆనంద్ బాబు యాదవ్ లు మాట్లాడుతూ వైసిపి నేత జగన్మోహన్ రెడ్డి పాలనపట్ల ప్రజలు విసుగుతుంది టిడిపి, జనసేన,బిజెపి పార్టీలకు ప్రజలు పట్టం కట్టి ఏడాది పూర్తయింది అన్నారు. ఐదేళ్ల వైసిపి పాలనతో ప్రజలు విసుగు చెంది భూ కబ్జాలు దౌర్జన్యాలు హత్యలతో రాష్ట్రం అట్టుడికి పోయిందన్నారు. అందుకే వైసిపి పార్టీకి 11 ఎమ్మెల్యేల స్థానాలకే పరిమితం చేశారన్నారు. రాష్ట్రంలో వైసిపి పార్టీ డిపాజిట్ కూడా రాకుండా ప్రజలు ఓడించారన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువ నేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ల నేతృత్వంలో రాష్ట్రమని రంగాల్లో అభివృద్ధి చెందుతొందని, ప్రజల కష్టాలు తీరే రోజులు దగ్గరపడ్డాయి అన్నారు. చంద్రబాబుకు తిరుపతితో ఎంతో విడదీయరాణి బంధం ఉందని, చంద్రబాబు ముఖ్యమంత్రి తిరుపతి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో యశ్వంత్, సోమశేఖర్, పలువురు టిడిపి నేతలు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..