

మన న్యూస్,తిరుపతి, జూన్ 04 :– ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంతో శరవేగంగా ముందుకు దూసుకెళ్తోందని టిడిపి నేత, తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ పి భువన్ కుమార్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. టిడిపి, బిజెపి, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి భువన్ కుమార్ రెడ్డి తో పాటు టౌన్ బ్యాంకు మాజీ వైస్ చైర్మన్ ఆనంద్ బాబు యాదవ్ లు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు పి. భువన్ కుమార్ రెడ్డి , ఆనంద్ బాబు యాదవ్ లు మాట్లాడుతూ వైసిపి నేత జగన్మోహన్ రెడ్డి పాలనపట్ల ప్రజలు విసుగుతుంది టిడిపి, జనసేన,బిజెపి పార్టీలకు ప్రజలు పట్టం కట్టి ఏడాది పూర్తయింది అన్నారు. ఐదేళ్ల వైసిపి పాలనతో ప్రజలు విసుగు చెంది భూ కబ్జాలు దౌర్జన్యాలు హత్యలతో రాష్ట్రం అట్టుడికి పోయిందన్నారు. అందుకే వైసిపి పార్టీకి 11 ఎమ్మెల్యేల స్థానాలకే పరిమితం చేశారన్నారు. రాష్ట్రంలో వైసిపి పార్టీ డిపాజిట్ కూడా రాకుండా ప్రజలు ఓడించారన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువ నేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ల నేతృత్వంలో రాష్ట్రమని రంగాల్లో అభివృద్ధి చెందుతొందని, ప్రజల కష్టాలు తీరే రోజులు దగ్గరపడ్డాయి అన్నారు. చంద్రబాబుకు తిరుపతితో ఎంతో విడదీయరాణి బంధం ఉందని, చంద్రబాబు ముఖ్యమంత్రి తిరుపతి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో యశ్వంత్, సోమశేఖర్, పలువురు టిడిపి నేతలు పాల్గొన్నారు.