

మన న్యూస్ సింగరాయకొండ:-
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా, పెద్ద శేష వాహనం మరియు చిన్న శేష వాహనం ముందు నిర్వహించిన నృత్య ప్రదర్శనలో సింగరాయకొండ నర్తన కళా నిలయం విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. భక్తుల సమక్షంలో నిర్వహించిన ఈ నృత్య కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
విద్యార్థుల కళా నైపుణ్యానికి, శిక్షకుల కృషికి అందరూ ప్రశంసలు అందించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు విద్యార్థులను అభినందించారు.
