

వెదురుకుప్పం, మన న్యూస్: జర్నలిస్టుల ఆధ్వర్యంలో విలువల పట్ల అంకితభావంతో సాగిన వేడుకవెదురుకుప్పం, మన న్యూస్ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు (APUWJ) జిల్లా కార్యవర్గ సభ్యులు, విశాలాంధ్ర సీనియర్ జర్నలిస్టు, ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత గోవింద్ స్వామి జన్మదిన వేడుకలు వెదురుకుప్పం మండలంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి.ఈ వేడుకలో ప్రాంతీయ మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పాల్గొని గోవింద్ స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిజం పట్ల ఆయన నిబద్ధత, ప్రజల పక్షాన నిలిచే ధైర్యవంతమైన పాత్రపై ప్రత్యేకంగా స్పందించారు.ఈ వేడుకలో మన న్యూస్ ఎండీ చంద్రశేఖర్, మన న్యూస్ రిపోర్టర్లు ఎస్. సురేష్ రెడ్డి, ఎస్. రమేష్ రెడ్డి, నేటి ఆయుధం ఎడిటర్ రూప్ చంద్ర రెడ్డి, నేటి ఆయుధం రిపోర్టర్ కోలా జయ చంద్ర, టీవీ5 వెంకటేష్ రెడ్డి ,టిడిపి యువ నాయకులు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొని వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు..
మన న్యూస్ ఎండీ చంద్రశేఖర్ మాట్లాడుతూ: “జర్నలిజం అంటే నిష్పక్షపాతంగా నిజాన్ని ప్రజల ముందుంచే ప్రక్రియ. గోవింద్ స్వామి ఆ విలువలను అనుసరిస్తున్నారు. కమర్షియల్ ప్రెషర్, రాజకీయ ఒత్తిడుల నుంచి తల్లడిల్లకుండా ప్రజల పక్షాన నిలుస్తున్నారు. ఆయన కలం ప్రజల ఆకాంక్షలకు ప్రతినిధిగా మారింది.” అన్నారు. మన న్యూస్ రిపోర్టర్ ఎస్. సురేష్ రెడ్డి మాట్లాడుతూ : “ప్రజా సమస్యలు, గ్రామీణ బాధలు పట్టించుకుని వాటిని వెలికి తీసే జర్నలిజమే నేడు అవసరం. గోవింద్ స్వామి చేసిన పరిశోధనాత్మక కథనాలు చాలా మంది జీవితాలను మార్చాయి. ఆయన పనితీరు నేటి యువ జర్నలిస్టులకు మార్గదర్శకంగా నిలుస్తోంది.” అన్నారు. టీవీ5 రిపోర్టర్ వెంకటేష్ రెడ్డి మాట్లాడుతూ “పత్రికా రంగం నేడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. అటువంటి సమయంలో విలువల పట్ల అంకితభావంతో ఉండే వ్యక్తులు అరుదు. గోవింద్ స్వామి వ్యక్తిగత లాభనష్టాలను పక్కన పెట్టి, ప్రజల పక్షాన నిలిచిన ధైర్యవంతుడు. ఆయనలా ఉండడమే నిజమైన జర్నలిజం.” అన్నారు.నేటి ఆయుధం ఎడిటర్ రూప్ చంద్ర రెడ్డి మాట్లాడుతూ: “వెలకట్టలేని విలువలు, అనుభవం కలిగిన జర్నలిస్టు గోవింద్ స్వామి. ఆయన రచనలు ఎప్పుడూ సామాజిక స్పృహను నిగూఢంగా ప్రతిబింబిస్తాయి. పత్రికా రంగం లో ఆయన వంటివారు ఉన్నప్పుడు అది కేవలం వృత్తిగా కాక, బాధ్యతగా మారుతుంది.” అన్నారు.నేటి ఆయుధం రిపోర్టర్ కోలా జయ చంద్ర మాట్లాడుతూ: “నేటి జర్నలిస్టులకు గోవింద్ స్వామి జీవితం ఒక పాఠశాల. నిజాయితీ, సామాజిక స్పృహ, ప్రజల పక్షపాతం ఇవన్నీ కలిపి ఆయనను ప్రతిభావంతుడిగా నిలిపాయి. ఆయన వలె జర్నలిజాన్ని సేవగా భావించేవారు మనకు అవసరం.” అని అన్నారు.మన న్యూస్ రిపోర్టర్ ఎస్. రమేష్ రెడ్డి మాట్లాడుతూ: జర్నలిజం అంటే కేవలం వార్తల రచన మాత్రమే కాదు, అది ప్రజల సమస్యలను వెలికి తీసే ఒక సామాజిక ఉద్యమం. గోవింద్ స్వామి రిపోర్టింగ్లో ఉన్న నిజాయితీ, కష్టజీవుల పట్ల ఉన్న అంకితభావం ఎంతో మందికి ప్రేరణ. విలువల పట్ల నిబద్ధత ఉన్న పాత్రికేయులు నేటి సమాజానికి అత్యవసరం.” అని పేర్కొన్నారు. టిడిపి యువనాయకుడు మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపుతూ: “ఎంతటి వాటికైనా లొంగని గోవింద్ స్వామి నిజమైన ప్రజాపక్షపాత పాత్రికేయుడు. ఆయన పట్ల ప్రజల్లో ఉన్న గౌరవం చూస్తేనే తెలిసిపోతుంది – ఆయన కళాన్ని, కలాన్ని ఎవరూ కొనలేరు.” అని అభినందించారు.ఈ వేడుకలో కేక్ కట్, సన్మాన కార్యక్రమాలు, శుభాకాంక్షలు, స్వీట్లు పంచడం వంటి ఆనందకర ఘట్టాలు చోటుచేసుకున్నాయి. వివిధ వర్గాల ప్రజలు గోవింద్ స్వామిని ఘనంగా సన్మానించారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ, జర్నలిజం పట్ల ఆయన ఉన్న అసాధారణమైన అంకితభావాన్ని కొనియాడారు.ప్రతి పాత్రికేయుడికి గోవింద్ స్వామి ఆదర్శం.ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు గోవింద్ స్వామి జీవిత చరిత్ర నేటి యువ జర్నలిస్టులకు మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు. విలువల పట్ల కట్టుబాటు, ప్రజల పక్షాన నిలబడే ధైర్యం, నిజాయితీతో కూడిన రచన – ఇవే ఆయన జర్నలిజం యొక్క మూడు మూలస్తంభాలు అని పేర్కొన్నారు.
