

కలిగిరి, మన న్యూస్ : తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహానాడు పండుగకు ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం పొలంపాడు గ్రామం SC మాదిగ పాలెం నుండి తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకత్వం ఆధ్వర్యంలో భారీగా టిడిపి శ్రేణులు కార్యకర్తలు అభిమానులు తరలి వెళ్లారు. గురువారం ఉదయం పొలంపాడు SC మాదిగ కాలనీ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ జిందాబాద్,నందమూరి రామారావు జిందాబాద్, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, ఉదయగిరి ముద్దుబిడ్డ కాకర్ల సురేష్ అంటూ నినాదాలు చేస్తూ వాహనాలలో బయలుదేరి కడప లో జరుగు మహానాడుకు తరలి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలతో ఎక్కడికైనా తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉంటామని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి ఇప్పటికే లక్షల్లో తరలివచ్చిన జనం కడపను పసుపు మాయం చేసిందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు,బూత్ ఇంచార్జి లు, టీడీపీ కార్యకర్తలు అభిమానులు. మహానాడు పండుగకు బయలుదేరి వెళ్లారు.