సిఈఐఆర్ పోర్టల్ ద్వారా 91 మొబైల్ ఫోన్లు రికవరి, బాధితులకు అందజేత – జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐ పి ఎస్

చోరీ మొబైల్ ఫోన్లు కొనడం, అమ్మడం నేరం- మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ www.ceir.gov.in వెబ్ పోర్టల్ లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ను సంప్రదించండి.- – మొబైల్ దొంగతనం చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలి.

మన న్యూస్ నారాయణపేట జిల్లా: మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) వెబ్ పోర్టల్ లో కానీ ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐ పి ఎస్ తెలిపారు. బుధవారం రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నందు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి గత రెండు నెలల్లో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న 91 మంది బాధితుల మొబైల్ పోన్లను కనిపెట్టి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… నూతన టెక్నాలజీ ఆధారంగా నారాయణపేట జిల్లా పరిధిలో మొత్తం 91 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగింది వాటి విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. మొబైల్ ఫోన్లను బాధితులకు బుధవారం రోజు అప్పగించడం జరిగింది. మొబైల్ దొంగతనం చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఎస్పీ పోలీసు అధికారులకు తెలిపారు. ప్రజలు ఎవరు పాత మొబైల్ ఫోన్ల ను కొనరాదు అని, చోరీ అయిన మొబైల్ ఫోన్లను కొనడం అమ్మడం నేరమని ఎస్పి తెలిపారు. మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని నేరస్తులు దొంగలించిన మొబైల్ ఫోన్లను దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉంటూ వెంటనే సి ఈ ఐ ఆర్ పోర్టల్ లో ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు. మొత్తం 91 ఫోన్ లను నూతన టెక్నాలజీ సాయంతో ఐటి కోర్ పోలీసులు ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది.అందుకు ఐటి కోర్ టీమ్ ను ఎస్పీ అభినందించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండి రియాజ్ హుల్ హక్, ఎస్సై లు సునీత, రమేష్, నరేష్ , పోలీసు సిబ్బంది, మొబైల్ తీసుకున్న వారు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..