భారత్‌తో సిమ్లా సహా అన్ని ద్వైపాక్షిక ఒప్పందాల తాత్కాలిక నిలిపివేత

మన న్యూస్ :- జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న కఠిన దౌత్యపరమైన చర్యలకు ప్రతిగా పాకిస్తాన్ కూడా తీవ్రంగా స్పందించింది. సిమ్లా ఒప్పందంతో సహా భారత్‌తో ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది.

పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన జాతీయ భద్రతా కమిటీ సమావేశం అనంతరం ఈ కీలక నిర్ణయాలు వెలువడ్డాయి.సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడాన్ని పాకిస్తాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఒప్పందం ప్రకారం తమకు రావాల్సిన నీటి ప్రవాహాన్ని ఆపడానికి లేదా దారి మళ్లించడానికి ప్రయత్నిస్తే, దానిని ‘యుద్ధ చర్య’గా పరిగణిస్తామని పాక్ ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరించింది. తమ జాతీయ శక్తి సామర్థ్యాల మేరకు పూర్తిస్థాయిలో ప్రతిస్పందిస్తామని స్పష్టం చేసింది.అంతేకాకుండా, భారత్‌కు చెందిన లేదా భారత్ ద్వారా నడిచే అన్ని విమానాలకు తక్షణమే తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. భారత్‌తో అన్ని రకాల వాణిజ్యాన్ని, పాకిస్తాన్ మీదుగా ఇతర దేశాలకు జరిగే వాణిజ్యాన్ని కూడా తక్షణమే నిలిపివేస్తున్నట్లు తెలిపింది. భారత్ చర్యలకు బదులుగా వాఘా సరిహద్దు పోస్టును మూసివేయడంతో పాటు, ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లోని సిబ్బంది సంఖ్యను 30కి తగ్గించాలని, ఇక్కడి భారత రక్షణ శాఖ అధికారులను బహిష్కరించాలని కూడా పాకిస్తాన్ నిర్ణయించింది.నిన్న భారత్ తీసుకున్న చర్యలకు ప్రతిగానే పాకిస్తాన్ ఈ నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, దౌత్య సంబంధాలను తగ్గించడం, పాక్ దౌత్యవేత్తలను, రక్షణ శాఖ అధికారులను బహిష్కరించడం, పాక్ పౌరులకు వీసాలు రద్దు చేసి 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించడం, అటారీ-వాఘా సరిహద్దును మూసివేయడం వంటి చర్యలను భారత్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం, సరిహద్దుల ఆవల హత్యలు, అంతర్జాతీయ చట్టాలను, కాశ్మీర్‌పై ఐక్యరాజ్యసమితి తీర్మానాలను భారత్ పాటించడం లేదని ఆరోపిస్తూ, ఈ పరిస్థితులు చక్కబడే వరకు ఒప్పందాలను నిలిపివేస్తున్నట్లు పాకిస్తాన్ పేర్కొంది.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///