

Mana News :- హైదరాబాద్: వచ్చే ఏడాది తాను పాదయాత్ర చేయనున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. భారాసను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాల పర్యటనలు ప్రారంభించానని, డిసెంబర్ వరకు పార్టీ బలోపేత కార్యక్రమాల్లో ఉంటానని చెప్పారు. భారాస కార్యక్రమాలకు అద్భుత స్పందన వస్తోందని, వచ్చే ఎన్నికల్లో భారాస అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
