అమరావతి కేంద్రంగా బిగ్ డెసిషన్ – గేమ్ ఛేంజర్..!!

Mana News :- ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం కొత్త రాజధాని అమరావతి విషయంలో వ్యూహాత్మక నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇప్పటి వరకు ఆర్దిక వనరుల సమీకరణ పైన ఫోకస్ చేసిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు నిర్మాణాల పైన కసరత్తు చేస్తోంది. పలు నిర్మాణాలకు టెండర్లు ఖరారు చేసింది. ఇక, కీలకమైన ఐకానిక్ టవర్స్ టెండర్లు పిలిచేందుకు సిద్దమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతికి ప్రధాని :- అమరావతి పనుల రీ లాంఛ్ కోసం ప్రధాని మోదీని ఆహ్వానించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఇదే అంశం పైన ఢిల్లీ పర్యటనలో చర్చించారు. ఈ నెలాఖరులో ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు.. ప్రధానితో భేటీ అయి అమరావతికి ఆహ్వానించనున్నారు. అమరావతి పనుల ప్రారంభ ఘట్టం అట్టహాసంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. నవనగరాల నిర్మా ణం లో భాగంగా ప్రధాని తో ఆ సిటీలకు శంకుస్థాపన చేయించనుంది. ఏప్రిల్ మూడో వారంలో ప్రధాని అమరావతికి వచ్చే అవకాశం ఉందని. ఇక, టెండర్లు పూర్తయిన వాటి నిర్మాణాలకు షెడ్యూల్ ఖరారు చేస్తోంది. ఐకానిక్ భవనాల కోసం:- అమరావతి పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకా మిగిలి ఉన్న ముఖ్యమైన పనులకు టెండర్లు పిలిచే పనిలో సీఆర్​డీఏ అధికారు లు కసరత్తు చేస్తున్నారు. అమరావతి ప్రభుత్వ సముదాయంలోనే అత్యంత కీలకమైన ఐకానిక్‌ టవర్లకు వచ్చే వారం టెండర్లు పిలవాలని భావిస్తున్నారు. ఐదు టవర్ల నిర్మాణానికి ప్రస్తుత ధరల మేరకు రూ. 4,687 కోట్ల వ్యయానికి ప్రభుత్వం పాలనాపరంగా ఆమోదించింది. గతంలోలాగే ఈసారి కూడా మూడు ప్యాకేజీలుగా టెండర్లు పిలవనున్నారు. జేఏడీ టవర్‌ బేస్‌మెంట్‌, గ్రౌండ్ ఫ్లోర్‌ కాకుండా 47 అంతస్తులు కాగా, మిగిలిన 4 హెచ్‌ఓడీ టవర్లు 39 అంతస్తులుగా డిజైన్‌ చేశారు. ఈ టవర్ల నిర్మాణానికి 60 వేల టన్నుల స్టీల్‌ అవసరమవుతుంది. 2028 లక్ష్యంగా :- ఇందు కోసం సీఆర్డీఏ అధికారులు ఇప్పటికే రాయగడ ఉక్కు పరిశ్రమతో పాటు బళ్లారిలోని జిందాల్‌ కర్మాగారం, తిరుచిరాపల్లిలోని ఎవర్‌సెందై వర్క్‌షాపులను పరిశీలించారు. రాయగడలో ఉక్కు కొని బళ్లారి, తిరుచిరాపల్లిలో ఫ్యాబ్రికేట్‌ చేయనున్నారు. త్వరలోనే మద్రాస్‌ ఐఐటీ నిపుణు వచ్చి పునాదుల పటిష్టతను పరిశీలించనున్నారు. రాజధానిలో సువిశాలమైన రహదారులు నిర్మానం చేసి చైన్నై-కోల్‌కతా హైవేతో పాటు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు అనుసంధానించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు రాజధానిలోని అన్ని ప్రధాన రోడ్లను అనుసంధానించేలా డీపీఆర్‌ రూపొందిస్తున్నారు. అమరావతిలో మొత్తంగా రూ 64,721 కోట్ల ఖర్చుతో ప్రారంభిస్తున్న నిర్మాణ పనులను 2028 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది.

Related Posts

సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ రిపోర్టర్ పసుమర్తి జాలయ్య:- సింగరాయకొండ మండల ప్రజా పరిషత్ సమావేశ హాలులో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశానికి మండల ప్రత్యేక అధికారి మరియు మత్స్య…

పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ, రిపోర్టర్ పసుమర్తి జాలయ్య :- సింగరాయకొండ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మిషన్ శక్తి పథకం అమల్లో భాగంగా, 10 రోజులపాటు నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమాల (సంకల్ప)లో భాగంగా పాకల గ్రామం జడ్పీహెచ్ఎస్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

  • By JALAIAH
  • September 10, 2025
  • 2 views
సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

  • By JALAIAH
  • September 10, 2025
  • 3 views
పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

  • By JALAIAH
  • September 10, 2025
  • 3 views
మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

  • By JALAIAH
  • September 10, 2025
  • 4 views
రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

  • By RAHEEM
  • September 10, 2025
  • 8 views
నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 9 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ