ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ ఏడాది ఉత్తమ లెజిస్లేటర్‌ అవార్డు

Mana News :- పార్లమెంట్‌లో ఎంపీలకు ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు ఇచ్చినట్టుగానే.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ ఏడాది ఉత్తమ లెజిస్లేటర్‌ అవార్డు కూడా ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం.. ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ 2025-26 సమావేశాల నుంచి వచ్చే ఏడాది బడ్జెట్‌ సమావేశాల వరకు సభలో సభ్యుల పనితీరును పరిగణనలోకి తీసుకుని.. ఉత్తమ లెజిస్లేటర్‌ అవార్డుకు ఎంపిక చేయబోతున్నారు.. సభ్యుల పనితీరు, వారు అడుగుతున్న ప్రశ్నల తీరు.. సభలో వారి ప్రవర్తన ఆధారంగా ఈ అవార్డుకు సభ్యులను ఎంపిక చేయనున్నారు.. దీనిపై త్వరలోనే ఓ కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు..ఇటీవల స్పీకర్‌ చింతకాలయ అయ్యన్నపాత్రుడితో సమావేశమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాడు.. ఉత్తమ లేజిస్లేటర్‌ అవార్డుపై చర్చించారు.. గతంలో శాసనసభ్యులుగా అసెంబ్లీలోకి ప్రవేశించినప్పుడు అప్పట్టి పరిస్థితులు ఎలా ఉండేవి? సభా సంప్రదాయాలకు ఎలా విలువనిచ్చేవారు? చర్చలు ఎలా జరిగేవి వంటివి గుర్తు చేసుకున్నారు.. అయితే, ఇప్పుడు కూడా సభలో చర్చల్లో ఇంకా నాణ్యత, సభ్యుల భాగస్వామ్యం పెరగాలని అభిప్రాయపడ్డారు.. అలా సభ ప్రజావాణిని వినిపించేందుకు వేదికగా నిలబడాలని స్పీకర్‌, సీఎం అభిప్రాయాలన్ని వ్యక్తం చేశారు.. అందులో భాగంగానే ఉత్తమ లెజిస్లేటర్‌ అవార్డు ఇస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారట.. ఉత్తమ లెజిస్లేటర్‌ ఎంపిక కోసం అసెంబ్లీలోనూ ఒక కమిటీని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి కూడా రాగా.. ఇప్పుడు కమిటీ ఎంపిక కోసం ముందడుగు వేస్తోంది ప్రభుత్వం..

Related Posts

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

గొల్లప్రోలు జూన్ 8 మన న్యూస్ : ఏ పి ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ఏర్పాటు జరిగినట్లు సొసైటీ జనరల్ సెక్రటరీ, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కనిగిరి వెంకట రంగారావు ఒక ప్రకటన లొ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి