నెల్లూరు,మన న్యూస్, మార్చి 12 :- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ మంత్రివర్యులు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసి, మహానేత వై.యస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి, నివాళులర్పించి, అనంతరం కేక్ కట్ చేసి విచ్చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. శాసనమండలి సభ్యులు మేరీగ మురళీధర్ , మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య , మాజీ రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి , ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి తో పాటు, పెద్ద ఎత్తున పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ మండల కన్వీనర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *