

మన న్యూస్, గంగాధర్ నెల్లూరు,మార్చి 04:– మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాపరెడ్డి చిత్తూరు జిల్లా లో విస్తృత పర్యటన చేశారు.. చిత్తూరు జిల్లా పర్యటన లో భాగంగా పాఠశాలలు, గురుకుల పాఠశాలలు,ఎఫ్ పి షాప్ లు,పి హెచ్ సి లు అంగన్వాడీ కేంద్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప రెడ్డి పర్యటించారు. చిత్తూరు జిల్లా లో విస్తృత పర్యటనలో భాగంగా పూతలపట్టు,పెనుమూరు, ఎస్ ఆర్ పురం, గంగాధర నెల్లూరు, బంగారుపాళ్యం మండలాలలోని, ఎఫ్ పి షాప్ లు, అంగన్వాడీ కేంద్రాలు, ఎండియు వాహనాల తనిఖీ,పి హెచ్ సి లు పరిశీలించారు. గంగాధర నెల్లూరు మండలం లో అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాల నిర్వహణపై ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ పిల్లలకు బాల్యం చాలా ముఖ్యమైన ఘట్టామని, చదువు చాలా ముఖ్యమని, చదువుకోవడం వలన వారి జీవితం మెరుగుపడుతుందని అందరూ బాగా చదువుకోవాలని తెలిపారు. పౌర సరఫరాల శాఖ ద్వారా పొందే బియ్యం నాణ్యతను పరిశీలించి, రాష్ట్ర ప్రభుత్వం రేషన్, స్కూల్స్, ఐ సి డి ఎస్ లకు నాణ్యమైన బియ్యం ను అందజేస్తుందని, ఇంట్లో అన్నం వండేటప్పుడు గంజి వంచవద్దని అత్తెసరు పద్దతిలో అన్నం వండుకోవాలని, ఇలా చేయడం వల్ల ఆహారంలోని పౌష్టికత పుష్కలంగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పిల్లల ఆరోగ్యంపై దృష్టి సారించి మంచి నిర్ణయాలతో పాలు, గుడ్లు, వంటి అధిక విటమిన్, ప్రోటీన్ లు కలిగిన ఆహారాన్ని పిల్లలకు అందిస్తుందని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటే చదువులో ముందడుగు వేస్తారని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వారు బాలలకు తొలిదశ నుండే అబివృద్ది పధం లో నడిపేందుకు పైలట్ ప్రాజెక్టులు నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమములో డీఎస్ఓ శంకరన్, డిఎం సివిల్ సప్లై బాలకృష్ణ,జిల్లా విద్యాశాఖాధి కారి వరలక్ష్మి,ఐ సి డి ఎస్ అధికారి వెంకటేశ్వరి , సాంఘీక, వెనుకబడిన సంక్షేమ శాఖ డి డి లు చెన్నయ్య, రబ్బానీ భాషా మరియు తదితరులు పాల్గొన్నారు.