యాదమరి, మన ధ్యాస, డిసెంబరు-04 చిత్తూరు జిల్లా ఎస్‌టియు శాఖ కార్యాలయంలో ఈరోజు జరిగిన కీలక కౌన్సిల్ సమావేశంలో యాదమరి మండల ఎస్‌టియు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా సుబ్రహ్మణ్యం పిళ్ళై ఎన్నిక కాగా, గౌరవాధ్యక్షులుగా విశ్రాంత ఉపాధ్యాయులు గుణశేఖరన్ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన కార్యదర్శిగా రంగనాథం ఎంపికయ్యారు. జిల్లా కౌన్సిలర్లుగా గణపతి, రమేష్ ఎంపిక కాగా, ఉపాధ్యక్షులుగా ఎస్‌ఎన్ భాషా, ఓబుల్ రెడ్డి, లోహితానంద వల్లి ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా మణిరెడ్డి, తులసీరామ్ బాధ్యతలు స్వీకరించారు. సిపిఎస్ కన్వీనర్‌గా నాగభూషణం, మహిళా కన్వీనర్‌గా ఉమ ఎన్నికయ్యారు. మహిళా కార్యదర్శులుగా ప్రమీలకుమారి, కస్తూరి, లక్ష్మి, రేవతి, మల్లీశ్వరి ఎంపికయ్యారు. ఎన్నికైన నూతన సభ్యులందరూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, సంఘ బలోపేతం, కార్యకలాపాల పురోగతికి అంకితభావంతో పనిచేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటా మోహన్, చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర కమిటీ కన్వీనర్ దేవరాజులు రెడ్డి నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు. యాదమరి మండల ఎస్‌టియు కార్యకలాపాలకు కొత్త నేతృత్వంతో ఒక కొత్త దశ ప్రారంభమైనట్లు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *