మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-

సింగరాయకొండ మండలం పాకలగ్రామంలో రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం అని రైతులకు వివరించి అధిక యూరియా వలన కలుగు నష్టాలను తెలియజేసినారు. ఈ కార్యక్రమానికి మండల స్పెషల్ స్పెషల్ ఆఫీసర్, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ సిహెచ్ శ్రీనివాసరావు ,ఎమ్మార్వో మరియు ఎంపీడీవో ,మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది యూరియాను అధికంగా వాడటం వల్ల నేల ఆమ్లత్వం పెరిగిపోతుంది నేలలోని పోషకాలు అసమతుల్యత ప్రయోజనకరమైన అంతరాయం కలిగిస్తుంది
పచ్చని వృక్ష సంపద పెరుగుదలను ప్రోత్సహిస్తుంది కానీ పుష్పించే మరియు పండ్ల నిర్మాణం ఆలస్యం అవుతుంది
అధిక నత్రజని ఉన్న పంటలు తెగుళ్లు మరియు వ్యాధులకు ఎక్కువగా గురి అవుతాయి
అదేవిధంగా యూరియా మనకు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పేసి తెలియజేయడం జరిగింది మండల తాసిల్దార్ ఎన్ బి వి రాజేష్ ఎంపీడీవో డి జయమణి పూర్ణచంద్రరావు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *