జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు మీనాక్షి, రాధా కుమారి ఎంపిక

యాదమరి, మన ధ్యాస సెప్టెంబర్ 4 :

చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఈరోజు ప్రకటించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. వరిగపల్లి, యాదమరి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్)గా పనిచేస్తున్న మీనాక్షి, చెర్లోపల్లి, చిత్తూరు రూరల్ మండలం మోడల్ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రాధా కుమారి ఈ అవార్డుకు ఎంపికైనారు. గత 20 సంవత్సరాలుగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్న మీనాక్షి, అనేకమంది విద్యార్థులను చదువుతోపాటు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. రిసోర్స్ పర్సన్‌గా ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమాలలో పాల్గొని విద్యా రంగంలో విశేష కృషి చేశారు. విద్యార్థుల్లో జాతీయ సమైక్యత, దేశభక్తి పెంపొందించే విధంగా బోధించడం ఆమె ప్రత్యేకత. రాధా కుమారి, సెకండరీ గ్రేడ్ టీచర్‌గా మోడల్ ప్రాథమిక పాఠశాల, చెర్లోపల్లిలో తన బోధనతో విద్యార్థులను ప్రేరేపిస్తూ, వారిలో విద్యాసక్తిని పెంపొందించడంలో విశేష పాత్ర పోషించారు. చిన్నారులలో విద్యాపై ఆసక్తిని కలిగించేందుకు అనేక వినూత్న బోధనా పద్ధతులను అమలు చేశారు. ఈ ఇద్దరు ఉపాధ్యాయుల అంకితభావాన్ని పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన చిత్తూరు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరగబోయే ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో వీరు తమ ప్రతిష్టాత్మక అవార్డులను స్వీకరించనున్నారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!