పండగలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి, మక్తల్ సీ ఐ రామ్ లాల్.

మన ధ్యాస నారయణ పేట జిల్లా : ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబి పండగల సందర్భంగా సిఐ రామ్ లాల్ ఆధ్వర్యంలో మక్తల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మండల అదికారులు, హిందూ, ముస్లిం మత పెద్దలు, మంటపలా నిర్వాహకులతో శాంతి సమావేశం నిర్వహించడం జరిగిందని సిఐ రామ్ లాల్ తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలులో భాగంగా గణేష్ శోభాయాత్ర సమయంలో విగ్రహాల ఏర్పాటు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మత పెద్దలు ఉత్సవ కమిటీ సభ్యుల సూచనలను నోట్ చేసుకుని అవసరమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, ప్రజలంతా పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలని తెలిపారు.ఈ సందర్భంగా మక్తల్ సీఐ రామ్ లాల్, ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి లు మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబి పండుగలను ప్రజలంతా కులమతాలకతీతంగా సామరస్యంగా శాంతియుతంగా జరుపుకోవాలని సిఐ తెలిపారు. మక్తల్ పరిధిలో ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదే విధంగా తమ వంతుగా ఉత్సవ కమిటీలు ముఖ్య పాత్ర పోషించాలని, యువతకు పెద్దలు దిశా నిర్దేశం చేయాలని కోరారు. డీజే లకు అనుమతి లేదని ఎవరైనా డీజేలు పెడితే సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు పటిష్ఠమైన పోలీసు భద్రత ఉంటుంది, నిమర్జనం అయ్యే వరకు ప్రతి గణేష్ మండపానికి 24 గంటలు భద్రత కల్పిస్తాం, సిఫ్ట్ ల వారీగా సిబ్బంది విధులు నిర్వహిస్తారని అన్నారు. మంటలపాల దగ్గర కచ్చితంగా వాలంటీర్లు ఉండాలని తెలిపారు. ఉత్సవాలను ఒకరిపై ఒకరు పోటీ కోసం జరప వద్దని అందరూ కలిసిమెలిసి భక్తి భావంతో ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని సిఐ గారు విజ్ఞప్తి చేశారు. గణేష్ విగ్రహాల ఏర్పాటుకు మండపాల ఏర్పాటుకు ముందస్తుగా ఆన్లైన్ పోలీసు పోర్టల్ లో అనుమతులు తీసుకోవాలని కోరారు. ఎక్కడ ఏ విగ్రహం ఏర్పాటు చేశారనేది పోలీసు వారి దృష్టిలో ఉంటే అత్యవసర సమయంలో భద్రత కల్పించడం సులువు అవుతుంది, సెక్టార్ల వారీగా పోలీస్ సిబ్బంది అనుక్షణం విధులు నిర్వహిస్తారని తెలిపారు. మండపాల ఏర్పాటు సమయంలో నాణ్యమైన సామాగ్రి ఉపయోగించాలి, మంచి కరెంట్ వైర్ ఉపయోగించాలి, మండపాల వద్ద ఫైర్ సేఫ్టీ కోసం నీటి బకెట్స్, ఇసుక బకెట్స్, వంటివి అందుబాటులో ఉంచుకోవాలి, ఉత్సవ కమిటీ వారు అందుబాటులో ఉండాలి అని కోరారు. వివాదాస్పదమైన స్థలం లో మండపాలు ఏర్పాటు చేయొద్దు, రోడ్లపై ఏర్పాటు చేయొద్దు అని నిమర్జనం శోబాయాత్ర లో ఉపయోగించే వాహనం కండిషన్ లో ఉండాలి, పిల్లలను శోభాయాత్ర వాహనాలు ఎక్కించవద్దు అని కోరారు. బానా సంచా నిషేదం. భక్తి పాటలు ప్రసారం చేయాలి, రాత్రి 10 గంటల తర్వాత మైక్ లు పెట్టవద్దు అని విజ్ఞప్తి చేశారు. మట్టి గణేష్ ను ఏర్పాటు చేయడం పర్యావరణానికి మంచిది అని కోరారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దు, తప్పుడు సమాచారంతో ఎవ్వరూ ఉద్రేకానికి లోనై చట్ట ఉల్లంఘనకు పాల్పడవద్దు, ఏదైనా ఉంటే అధికారుల దృష్టికి తెచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని అన్నారు. పండుగల శోభాయాత్ర సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులందరూ గణేష్ మార్గ్ నీ పరిశీలించడం జరిగిందని అవసరమైన ఏర్పాట్లు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలోఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్, AE విద్యుత్ అధికారులు, గణేష్ మండపాల నిర్వాహకులు హిందూ ముస్లిం మత పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో జరిగిన పోషణ మాసం మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం…

పేదోడి సొంతింటి కల నెరవేరింది..

మనధ్యాస,నిజాంసాగర్(జుక్కల్): సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుతో పేదోడి సొంతింటి కల నిజమవుతుందని నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. సోమవారం సుల్తాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటికి ప్రారంభోత్సవం నిర్వహించారు.ఇందిరమ్మ పథకం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?