12వ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్ళనున్న మున్సిపల్ కార్మికులు. సి.ఐ.టి.యు

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు లో ఏ.పి.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో శుక్రవారం రోజు రాష్ట్ర,జిల్లా కమిటీల పిలుపుమేరకు మున్సిపల్ కార్మికులు బైక్ ర్యాలీ గూడూరు పట్టణంలోని పురవీధులలో సి.ఐ.టి.యు జెండాలు చేత పట్టుకొని “మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి – సిఐటియు జిందాబాద్” -“సమాన పనికి – సమాన వేతనం” ఇవ్వాలి ఇంజనీరింగ్ కార్మికులకు 36వ జి.ఓ.వర్తించాలి, కనీస వేతనం రూ.26,000/-వేల రూపాయలు ఇవ్వాలి, పది గంటల పని విధానాన్ని ఆపాలి, అంటూ నినాదాలుతో మున్సిపల్ కార్మిక సంఘం కార్యదర్శి ధారా కోటేశ్వరరావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య మరియు ఇంజనీరింగ్ కార్మికులకు అందరికీ సంక్షేమ పథకాలు, తల్లికి వందనం వర్తింపచేయాలని, మున్సిపల్ కార్మికులు చనిపోతే దహన సంస్కారాలకి 20,000 పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాడ్యుటి, ఎక్స్ గ్రేషియా పెంపు, గత 17 రోజులు సమ్మె కాలపు ఒప్పందాలు, వెంటనే అమలు చేయాలని గత ఐదు రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో నిరసనలు తెలియజేస్తున్నా, కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేనట్లుగా ప్రవర్తించడం బాగాలేదని, మున్సిపల్ కార్మికులకు రావలసినవే అడుగుతున్నారే తప్ప అదనంగా ఇంకేమీ కోరడం లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిపిన మంత్రివర్గం చర్చల్లో మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికుల పట్ల, చర్చించి న్యాయం చేస్తారని ఇప్పటిదాకా వేచి చూసామని కానీ మంత్రివర్గ చర్చల్లో మున్సిపల్ కార్మికుల పట్ల ఎటువంటి చర్చలు జరపకపోవడం అన్యాయమని, ఇకనైనా ప్రభుత్వం వెంటనే మంత్రివర్గంతో చర్చలు జరిపి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు, ఇంజనీరింగ్ కార్మికులకు, ఎన్నికలలో ఇచ్చిన హామీలకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. లేని పక్షంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 12వ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్లడం జరుగుతుందని, ఇప్పటికైనా మంత్రివర్గం నిర్ణయం తీసుకొని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు, ఇంజనీరింగ్ కార్మికులకు, న్యాయం చేయాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సంఘం ఉపాధ్యక్షులు ఎన్.. వెంకట రమణయ్య, సహాయ కార్యదర్శి సి.హెచ్.రాజేష్, గూడూరు పట్టణ సి.ఐ.టి.యు ప్రధాన కార్యదర్శి బి.వి రమణయ్య, అధ్యక్షులు పామంజి మణి,జి.శ్రీనివాసులు, ఆర్. ఆనంద్,ఎస్.శివ,ఎంబేటి చంద్రయ్య, శివరామయ్య, రాఘవ, వెంకట రమణయ్య, చంద్రమోహన్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

కూటమి పాలనలో అర్హులైన వారందరికీ సూపర్ సిక్స్ పథకాలు…

మన న్యూస్,తిరుపతి: తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో పార్టీలకతీతంగా అర్హులైన పేదలందరికీ సూపర్ సెక్స్ పథకాలు లబ్ధి చేకూరుతాయని రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తెలిపారు. శుక్రవారం 38వ డివిజన్ పరిధిలోని సింగాలగుంటలో క్లస్టర్ ఇంచార్జ్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి…

మంత్రి కేశవ -కాలువ అభివృద్ధి పనుల పరిశీలన.

ఉరవకొండ, మన న్యూస్ :ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్, రాయదుర్గం ప్రభుత్వవిప్ కాలువ శ్రీనివాసులు శుక్రవారంపలు అభివృద్ధి పనులను పరిశీలించారు. జిల్లా లోని రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని కనేకల్ మండలం ఎర్రగుంట గ్రామం 137 కిమీ దగ్గర l హై లెవెల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కూటమి పాలనలో అర్హులైన వారందరికీ సూపర్ సిక్స్ పథకాలు…

కూటమి పాలనలో  అర్హులైన వారందరికీ సూపర్ సిక్స్ పథకాలు…

ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.

ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.

మంత్రి కేశవ -కాలువ అభివృద్ధి పనుల పరిశీలన.

మంత్రి కేశవ -కాలువ అభివృద్ధి పనుల పరిశీలన.

నా ప్రాణం ఉన్నంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా… కటిక పల్లి సర్పంచ్ మార్కొండయ్య

నా ప్రాణం ఉన్నంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా… కటిక పల్లి సర్పంచ్ మార్కొండయ్య

పిల్లల బంగారు భవిష్యత్తు గా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులు తల్లిదండ్రులదే… ప్రధానోపాధ్యాయులు హిమాచలపతి

పిల్లల బంగారు భవిష్యత్తు గా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులు తల్లిదండ్రులదే… ప్రధానోపాధ్యాయులు హిమాచలపతి

సాలూరులో సి పి ఎం పార్టీ మండల కమిటీలు – సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు

సాలూరులో సి పి ఎం పార్టీ మండల కమిటీలు – సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు