ప్రాణాన్ని నిలబెట్టే వైద్యులు దేవుడితో సమానం – సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె రవి

డాక్టర్స్ డే సందర్భంగా ప్రభుత్వ వైద్యులకు ఘన సన్మానం

పినపాక నియోజకవర్గం, మన న్యూస్ :- మణుగూరు : సమాజంలో సమర్థులైన వైద్యులు ఎందరో ఉంటారని,వారిలో సేవాభావం కలిగిన వైద్యులు కొందరే ఉంటా రని, సమర్ధత, సేవా భావం రెండూ ఉన్న వైద్యులు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చల్లని చూపుతో నిరు పేదలకు 24 గంటల పాటు వైద్య సేవలను అందించడం ఏజెన్సీ ప్రాంత ప్రజలఅదృష్టమని,ప్రముఖ సామాజిక కార్యకర్త, న్యాయవా ది కర్నె రవి అన్నారు.డాక్టర్స్ డే సందర్భంగా మంగళవారం వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆస్పత్రి సూపరిండెంట్ సునీల్ మంజేకర్, ఆర్ఏంఓ లు డాక్టర్. సాయి మోహన్, డాక్టర్. ఎం. గౌరీ ప్రసాద్, వైద్యులు శ్రీదేవి, ప్రేమ్ రెడ్డి, పద్మ, పావని, ప్రసాద్, నిఖి ల్, కృష్ణ శ్రీ, స్వాతి లను తెలంగా ణ ఉద్యమకారుడు వలసాల వెంకట రామారావు, నరేందర్ తో కలసి ఘనంగా సత్కరించి శుభా కాంక్షలు తెలిపారు. అనంతరం రవి మాట్లాడుతూ..ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్న వైద్యుల సేవలను ప్రజలు మరచిపోరని ప్రశంసించారు. డబ్బులకంటే సేవే ముఖ్యమనుకునే డాక్టర్లకు సమాజంలో మంచి గౌరవం, గుర్తింపు తప్పక లభిస్తుందన్నా రు. దేవుడు ప్రాణం పోస్తే.. ఆ ప్రాణాలు నిలబెట్టే సత్తా వైద్యుల కే ఉందన్నారు. వైద్య వృత్తి.. పవిత్రమైంది అని సమాజంలో వైద్యుడంటే ఎంతో గౌరవం ఉందన్నారు. వైద్య వృత్తిని సేవా దృక్పథంతో చేస్తే పేరు ప్రఖ్యాతు లు వస్తాయని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు యువ వైద్యుల చేతి లో ఉందని, ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం ఒక్క వైద్యు లకే ఉందన్నారు.అలాంటి వైద్యు లకు ప్రజలు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో సిద్దెల తిరుమలరా వు,వెంక ట్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నా రు.

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///