32 రకాల నవధాన్యాలతో కొత్త ప్రయోగం

మన న్యూస్ పాచిపెంట, జూన్ 21:- 25 కిలోల 32 రకాల నవధాన్య విత్తనాలను ఒక ఎకరానికి వేసి 40 రోజుల తర్వాత కలియదున్ని అనంతరం మొక్కజొన్న,వరి మరియు పొగాకు పంటలను వేస్తే నవధాన్యాల భూసార ఫలితం ఆయా పంటలపై ఎలా ఉంటుందో తెలుసుకునే సరికొత్త ప్రయోగాన్ని పాంచాలి గ్రామంలో రైతు సేనాపతి భాస్కరరావు పొలంలో చేయడం జరిగిందని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన శనివారం నాడు మాట్లాడుతూ నవధాన్యాలు భూసారాన్ని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయని వరుసగా మూడు సీజన్ల పాటు నవధాన్యాలను సాగు చేసి కలియ దున్నిన అనంతరం మొదటి సంవత్సరంతో పోలిస్తే మూడవ సంవత్సరం భూమిలో సేంద్రియ కర్బనం శాతం ఎంత పెరిగింది ప్రతి సంవత్సరం దిగుబడులు ఎంత పెరిగాయి రసాయన ఎరువులపై భారం ఎంతవరకు తగ్గుతుంది పంట చెడిపేడలను తట్టుకునే స్వభావం ఎంతవరకు మెరుగుపడుతుంది సాగు ఖర్చులు తగ్గి పంట నాణ్యత ఎంతవరకు పెరుగుతుంది అన్న విషయాలపై అధ్యయనం చేస్తామని రైతులకు క్షేత్రస్థాయిలో క్షేత్ర దినోత్సవాలను పెట్టి ఫలితాలను వివరిస్తామని తెలిపారు రాబోయే రోజులలో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీను మరియు ప్రకృతి సేద్య క్లస్టర్ ఎల్ వన్ తిరుపతి నాయుడు పాల్గొన్నారు.

Related Posts

యువత పోరు చేసే అర్హత వైసిపి పార్టీకి లేదు:-కొట్టే హేమంత్ రాయల్

మన న్యూస్, తిరుపతి : 2018లో 6 లక్షల మందికి ‘నిరుద్యోగ భృతి’ ఇస్తే వైసిపి ప్రభుత్వం లోకి రాగానే ఒక్క కలం పోటుతో రద్దు చేసిన జగన్, ఈ రోజు నిరుద్యోగ భృతి ఇంకా ఇవ్వలేదని వైసీపీ ధర్నా అట…

మంత్రి లోకేష్ బాబును కలిసిన గూడూరు ఎమ్మెల్యే

మన న్యూస్ గూడూరు:- ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబును అమరావతిలో గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు .ఈ సందర్భంగా వారు కొన్ని విషయాలపై చర్చించారు. గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

యువత పోరు చేసే అర్హత వైసిపి పార్టీకి లేదు:-కొట్టే హేమంత్ రాయల్

యువత పోరు చేసే అర్హత వైసిపి పార్టీకి లేదు:-కొట్టే హేమంత్ రాయల్

మంత్రి లోకేష్ బాబును కలిసిన గూడూరు ఎమ్మెల్యే

మంత్రి లోకేష్ బాబును కలిసిన గూడూరు ఎమ్మెల్యే

జీవితంలో కష్టపడితేనే ఫలితాలు అద్భుతం…

జీవితంలో కష్టపడితేనే ఫలితాలు అద్భుతం…

నీరు పారిశుద్ధ్యం, పరిశుభ్రత పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించండి…

నీరు పారిశుద్ధ్యం, పరిశుభ్రత పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించండి…

అంబేద్కర్ కులానికో, మతానికో నాయకుడు కాదు. అందరివాడు..

అంబేద్కర్ కులానికో, మతానికో నాయకుడు కాదు. అందరివాడు..

శంఖవరం ప్రభుత్వ పిహెచ్సీ ప్రధాన వైద్యాధికారి (డిడివో) గా శెట్టిబత్తుల రాజీవ్ కుమార్..

శంఖవరం ప్రభుత్వ పిహెచ్సీ ప్రధాన వైద్యాధికారి (డిడివో) గా శెట్టిబత్తుల రాజీవ్ కుమార్..