పాఠశాల ప్రాంగణంలో వాటర్ ట్యాంక్ కట్టడం సరైనదేనా? గద్వాల జిల్లా ప్రాంత బడుగు పిల్లల ఆశ మాయమవుతుందా?

జూన్ 23, జోగులాంబ గద్వాల | మన న్యూస్ ప్రతినిధి
బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాల భవిష్యత్తు ప్రమాదంలో పడనుందా? ఐజ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ట్యాంక్ నిర్మాణం పై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా గౌరవనీయ కలెక్టర్ గారికి ఓ ముక్త కంఠ వినతిపత్రాన్ని అందించారు. విద్యార్థులు చదువుకునే ప్రాంగణంలో వాటర్ ట్యాంక్ నిర్మించడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలు వివరంగా చర్చకు వస్తున్నాయి:

  1. పిల్లలకు ప్రమాదం జరగవచ్చు – చిన్నపిల్లలు ట్యాంక్ పైకి ఎక్కడం ద్వారా ప్రాణాపాయ పరిస్థితులు.
  2. మొక్కలు ధ్వంసం అవుతాయి – పాఠశాల గ్రీన్ కవర్ నశనం. స్కూల్ గ్రౌండ్ పూర్తిగా పాడవుతుంది.
  3. నిర్మాణం నడుస్తున్న సమయంలో తరగతులకు అంతరాయం.ట్యాంక్ నిండిన నీటి వల్ల దోమలు, ఈగలు వ్యాప్తి చెయ్యడం – ఆరోగ్య సమస్యలు.భవిష్యత్తులో ట్యాంక్ బలహీనమవడం వల్ల ప్రమాదం – అలంపూర్ నియోజకవర్గంలో ఇదే తరహాలో ఓ పాత ఘటన కూడా ఉదాహరణగా చెబుతున్నారు.

పాఠశాల అనేది కేవలం భవనం కాదు – గ్రామ ప్రజల ఆశ. లక్షల రూపాయలు వెచ్చించలేని పేద ప్రజల పిల్లల ఆశయం. ఈ నేపథ్యంలో స్కూల్ ప్రాంగణంలో ట్యాంక్ నిర్మించడం తప్పని, ఇతర ప్రాంతంలో నిర్మించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.విద్యార్థుల భద్రత కోసం, గ్రామ భవిష్యత్తు కోసం, సమాజం కోసం అధికారులు, నాయకులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ నిర్మాణంపై పునరాలోచించాలని గ్రామస్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

Related Posts

ఉపాధ్యాయులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించటం సరికాదు, డి టి ఎఫ్ నారాయణ పేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హైమావతి,సూర్యచంద్ర.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల పనితీరును పర్యవేక్షించడానికి ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను పర్యవేక్షణ అధికారులుగా నియమించి బాధ్యతలు అప్పగించడం సరికాదని, ఇది విద్యారంగ తిరోగమన…

మాదకద్రవ్యాలకు బానిస కావద్దని, జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, ఎస్సై

మన న్యూస్ నర్వ మండలం:- మాదక ద్రవ్యాలు నిర్మూలన వారోత్సవాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా నర్వ మండలం కల్వాల్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు మరియు మత్తు పదార్థాలు వాటి యొక్క దుష్ఫలితాలు, నిర్మూలన పై అవేర్నెస్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిజెపి నేతలు

రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిజెపి నేతలు

ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు

శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు

సాగు చేస్తున్న గిరిజన రైతులు భూములు కి ప్రభుత్వము పట్టలు ఇవ్వాలి

సాగు చేస్తున్న గిరిజన రైతులు భూములు కి ప్రభుత్వము పట్టలు ఇవ్వాలి