మన, న్యూస్ నారాయణ పేట జిల్లా : యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని మక్తల్ సీఐ రామ్ లాల్ అన్నారు.అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం,అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కారించుకొని మక్తల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు దూరంగా ఉండాలని, చెడు వ్యసనాలకు అలవాటు పడరాదని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీ ఐ రామ్ లాల్ గారు మాట్లాడుతూ, సరదా కోసం మొదలైన అలవాటు.. మత్తులోకి నెడుతోందని, గతంలో సిగరెట్‌, మద్యంతో సరిపెట్టుకునే యువత, ఇప్పుడు నిషా కోసం గంజాయి, మాదకద్రవ్యాల బారినపడి మత్తుకు బానిసలవుతున్నారని అన్నారు. సమాజంలోని మాదకద్రవ్యాల ముప్పును అంతం చేసే లక్ష్యంలో యువత భాగస్వామ్యం కావాలని అన్నారు.మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా నిర్మూలన కోసం నషాముక్త్ భారత్ అభియాన్ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు నేటి యువత బానిసలై తమ ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. యువత మాధకద్రవ్యాల బారిన పడకుండా ఉండేలా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల వినియోగం కారణంగా కలిగే దుష్ప్రభావాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాల బానిసలై విముక్తిపొందిన వారితో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను గురించి తెలియజేసినట్లైతే , యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా రక్షించవచ్చన్నారు.ఎవరైనా చెడు వ్యసనాలకి మారినట్లయితే తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో టీ జి ఏ ఎన్ బి టోల్ ఫ్రీ నెంబర్ 1908, డయల్ 100 కానీ మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఐ భాగ్యలక్ష్మి రెడ్డి, లెక్చరర్స్, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *