యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి, మక్తల్ సీఐ రామ్ లాల్.

మన, న్యూస్ నారాయణ పేట జిల్లా : యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని మక్తల్ సీఐ రామ్ లాల్ అన్నారు.అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం,అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కారించుకొని మక్తల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు దూరంగా ఉండాలని, చెడు వ్యసనాలకు అలవాటు పడరాదని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీ ఐ రామ్ లాల్ గారు మాట్లాడుతూ, సరదా కోసం మొదలైన అలవాటు.. మత్తులోకి నెడుతోందని, గతంలో సిగరెట్‌, మద్యంతో సరిపెట్టుకునే యువత, ఇప్పుడు నిషా కోసం గంజాయి, మాదకద్రవ్యాల బారినపడి మత్తుకు బానిసలవుతున్నారని అన్నారు. సమాజంలోని మాదకద్రవ్యాల ముప్పును అంతం చేసే లక్ష్యంలో యువత భాగస్వామ్యం కావాలని అన్నారు.మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా నిర్మూలన కోసం నషాముక్త్ భారత్ అభియాన్ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు నేటి యువత బానిసలై తమ ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. యువత మాధకద్రవ్యాల బారిన పడకుండా ఉండేలా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల వినియోగం కారణంగా కలిగే దుష్ప్రభావాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాల బానిసలై విముక్తిపొందిన వారితో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను గురించి తెలియజేసినట్లైతే , యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా రక్షించవచ్చన్నారు.ఎవరైనా చెడు వ్యసనాలకి మారినట్లయితే తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో టీ జి ఏ ఎన్ బి టోల్ ఫ్రీ నెంబర్ 1908, డయల్ 100 కానీ మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఐ భాగ్యలక్ష్మి రెడ్డి, లెక్చరర్స్, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఉపాధ్యాయులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించటం సరికాదు, డి టి ఎఫ్ నారాయణ పేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హైమావతి,సూర్యచంద్ర.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల పనితీరును పర్యవేక్షించడానికి ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను పర్యవేక్షణ అధికారులుగా నియమించి బాధ్యతలు అప్పగించడం సరికాదని, ఇది విద్యారంగ తిరోగమన…

మాదకద్రవ్యాలకు బానిస కావద్దని, జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, ఎస్సై

మన న్యూస్ నర్వ మండలం:- మాదక ద్రవ్యాలు నిర్మూలన వారోత్సవాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా నర్వ మండలం కల్వాల్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు మరియు మత్తు పదార్థాలు వాటి యొక్క దుష్ఫలితాలు, నిర్మూలన పై అవేర్నెస్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిజెపి నేతలు

రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిజెపి నేతలు

ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు

శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు

సాగు చేస్తున్న గిరిజన రైతులు భూములు కి ప్రభుత్వము పట్టలు ఇవ్వాలి

సాగు చేస్తున్న గిరిజన రైతులు భూములు కి ప్రభుత్వము పట్టలు ఇవ్వాలి