

తుర్కయంజాల్. మన న్యూస్ :-
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినోత్సవం సందర్బంగా తుర్కయంజాల్ కూడలిలో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు .కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పండ్లు పంపిణి చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన టిపిసిసి కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్ మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్నివేళలా ప్రజల వైపు నిలిచే నాయకుడు రాహుల్ గాంధీ నే అలాగే నియంతృత్వాన్ని నిలదీస్తూ బిజెపి పాలనలోని లోటుపాట్లను అడుగడుగున ప్రశ్నిస్తూ నిజాయితీతో నిస్వార్ధంగా ప్రజాక్షేత్రంలో నిరంతరం పోరాడుతున్న ప్రజానాయకుడని అని రానున్న రోజుల్లో రాహుల్ గాంధీనే దేశానికి కాబోయే ప్రధాని అని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు రేవల్లి యాదగిరి, గుడ్ల అర్జున్, ఓర్సు శ్రీనివాస్,దుగ్గని శ్యామల,గుండా శ్రీశైలం, లోహిత్ రెడ్డి, ఎరుకలి రవి,జనార్దన్, రవి తదితరులు పాల్గొన్నారు