సింగరాయకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ – శాంతి భద్రతలపై కీలక ఆదేశాలు

మన న్యూస్ సింగరాయకొండ:-

ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్. దామోదర్ ఐపీఎస్ గారు ఆదివారం ఉదయం సింగరాయకొండ సర్కిల్ ఆఫీస్ మరియు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, స్టేషన్ కార్యకలాపాలను సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణ, గదులు, రిసెప్షన్ కౌంటర్, రికార్డులు, మరియు పరిశుభ్రత పరిస్థితులపై మినితీ వివరాలు తెలుసుకున్నారు.ఎస్పీ గారు స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా మహిళల సమస్యలు, చిన్నారుల ఫిర్యాదులు మొదలైన అంశాలపై ప్రత్యేక దృష్టి అవసరమని పేర్కొన్నారు. విచారణలో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తిచేసి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.అలాగే, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, పాత నేరస్తులపై నిఘా, గ్రామాల్లో తరచూ పర్యటించడముతో ప్రజల భద్రతను మెరుగుపరచాలని సూచించారు. రాత్రివేళల్లో పెట్రోలింగ్ మరింత ముమ్మరం చేయాలని, గస్తీ విధులు పటిష్టంగా నిర్వర్తించాలని తెలిపారు.సైబర్ మోసాలు, మాదకద్రవ్యాల ప్రమాదాలు, హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలనీ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే సూచనలు ఇచ్చారు. స్టేషన్‌లో పనిచేసే సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నదని తెలిపారు.పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి పౌరునితో మర్యాదగా, కుటుంబ సభ్యులవలె మాట్లాడాలని, వారి సమస్యలకు పరిష్కారం చూపించడంలో పోలీసులు అందుబాటులో ఉండాలని సూచించారు. విధుల పట్ల నిబద్ధతతో పని చేయాలని ఆదేశించారు.ఈ తనిఖీలో ఎస్పీ గారితో పాటు ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐ హాజరత్తయ్య, ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ఎస్సై మహేంద్ర మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) :- పేదల పక్షాన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం లో శంఖవరం మండలం మరియు వివిధ గ్రామాలకు చెందిన 12…

III T లో సీట్లను కైవసం చేసుకున్న తుని గురుకులం విద్యార్థులు…

తుని మన న్యూస్ (అపురూప్) తుని గురుకులంలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు శ్రీకాకుళంలోని ఐ.ఐ.ఐ.టి లో సీట్లను కైవసం చేసుకుని ప్రతిభను కనబరిచారని తుని అంబేద్కర్ గురుకులం పాఠశాల ప్రిన్సిపల్ కనిగిరి విశ్వేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యదర్శి సూర్య…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి..ఎంఈఓ అమర్ సింగ్

  • By RAHEEM
  • June 25, 2025
  • 2 views
ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి..ఎంఈఓ అమర్ సింగ్

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

దుర్వాసనను భరించలేకపోతున్నాం… పట్టించుకోని అధికారులు.

  • By RAHEEM
  • June 25, 2025
  • 6 views
దుర్వాసనను భరించలేకపోతున్నాం… పట్టించుకోని అధికారులు.

III T లో సీట్లను కైవసం చేసుకున్న తుని గురుకులం విద్యార్థులు…

III T లో సీట్లను కైవసం చేసుకున్న తుని గురుకులం విద్యార్థులు…

శ్రీ ఉమామహేశ్వరాలయంలో వైభవంగా మట్టెద్దుల అమావాస్య వేడుకలు,భక్తులకు అన్నదానం.

శ్రీ ఉమామహేశ్వరాలయంలో వైభవంగా మట్టెద్దుల అమావాస్య వేడుకలు,భక్తులకు అన్నదానం.

మక్తల్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.

మక్తల్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.