సింగరాయకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ – శాంతి భద్రతలపై కీలక ఆదేశాలు

మన న్యూస్ సింగరాయకొండ:-

ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్. దామోదర్ ఐపీఎస్ గారు ఆదివారం ఉదయం సింగరాయకొండ సర్కిల్ ఆఫీస్ మరియు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, స్టేషన్ కార్యకలాపాలను సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణ, గదులు, రిసెప్షన్ కౌంటర్, రికార్డులు, మరియు పరిశుభ్రత పరిస్థితులపై మినితీ వివరాలు తెలుసుకున్నారు.ఎస్పీ గారు స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా మహిళల సమస్యలు, చిన్నారుల ఫిర్యాదులు మొదలైన అంశాలపై ప్రత్యేక దృష్టి అవసరమని పేర్కొన్నారు. విచారణలో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తిచేసి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.అలాగే, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, పాత నేరస్తులపై నిఘా, గ్రామాల్లో తరచూ పర్యటించడముతో ప్రజల భద్రతను మెరుగుపరచాలని సూచించారు. రాత్రివేళల్లో పెట్రోలింగ్ మరింత ముమ్మరం చేయాలని, గస్తీ విధులు పటిష్టంగా నిర్వర్తించాలని తెలిపారు.సైబర్ మోసాలు, మాదకద్రవ్యాల ప్రమాదాలు, హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలనీ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే సూచనలు ఇచ్చారు. స్టేషన్‌లో పనిచేసే సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నదని తెలిపారు.పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి పౌరునితో మర్యాదగా, కుటుంబ సభ్యులవలె మాట్లాడాలని, వారి సమస్యలకు పరిష్కారం చూపించడంలో పోలీసులు అందుబాటులో ఉండాలని సూచించారు. విధుల పట్ల నిబద్ధతతో పని చేయాలని ఆదేశించారు.ఈ తనిఖీలో ఎస్పీ గారితో పాటు ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐ హాజరత్తయ్య, ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ఎస్సై మహేంద్ర మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!