

కర్మన్ ఘాట్. మన న్యూస్: కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ ఎదురుగా చంద్రా గార్డెన్స్ లో ఆవుటి శంకర్ లింగం ఆధ్వర్యంలో ఆదివారం నాడు హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిసారిగా వీరశైవ లింగాయత్ వధూవరుల వివాహ పరిచయ వేదిక 2025 ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్,మాజీ పార్లమెంట్ సభ్యులు బి బి పాటిల్, జే పీ ఎన్ సి ఇ చైర్మన్ కె ఎస్ రవి కుమార్,వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంగం అధ్యక్షుడు పట్లోళ్ల సంగమేశ్వర్, వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంగం గౌరవ అధ్యక్షుడు బి.ఈశ్వరయ్య హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో 400 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.1500 మందికి పైగా హాజరయ్యారు.ఈ సందర్బంగా ఈ కార్యక్రమం నిర్వాహకులు ఆవుటి శంకర్ లింగం మాట్లాడుతూ ఇట్టి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని జరుపుతూ పేద ప్రజలకు అనుగుణంగా ఉంటామని తెలిపారు. తక్కువ ఖర్చుతో వ్యాపార నిమిత్తం కాకుండా కేవలం ప్రజాసేవ నిమిత్తము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ..వధూవరులకు మంచి పరిచయ వేదికగా కొనసాగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్.వజ్రలింగం, పి శివుడు మల్లిఖార్జున్,చంద్ర శేఖర్,రిటైర్డ్ ఎస్ ఐvశివలింగం,డి. రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
