మణికంఠ గౌడ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో స్వచ్చంధంగా భారీగా చేరిన తిప్రాస్ పల్లె గ్రామ యువకులు

మన న్యూస్, నారాయణ పేట జిల్లా:ఈ రోజు తెలంగాణ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు టీ టీ డి బోర్డ్ మెంబెర్ శ్రీ మహేందర్ రెడ్డి,తెలంగాణ పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, ఆర్ కే సాగర్ మరియు కుకట్ పల్లి ఏమెల్యే కంటెస్టెడ్ ప్రేమ్ కుమార్ గార్ల ఆదేశాల మేరకు నారాయణన పేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఉట్కూరు మండలం తిప్రాస్ పల్లె గ్రామానికి చెందిన శివ కుమార్ గారి ఆహ్వానం మేరకు డాక్టర్ మణికంఠ గౌడ్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాన్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి, తెలంగాణ జనసేన పార్టీ ఇంచార్జ్ నెమూరి శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు శివ కుమార్ గారి చొరవతో 35 మంది యువకులకు జనసేన పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానం పలికి పార్టీ లోకి స్వాగతించడం జరిగింది. తదనంతరం మణికంఠ గౌడ్ మాట్లాడుతూ, భవిష్యత్ లో తెలంగాణ లో జనసేన పార్టీ ఎనలేని శక్తి గా ఎదిగి ప్రభుత్వ స్థాపన దిశగా అడుగులేస్తోంది అని, తిప్రాస్ పల్లె యువకులు జనసేన పార్టీ కి మద్దతుగా పార్టీ లో చేరినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన స్థానం కల్పిస్తామని, జనసేన పార్టీ స్థానిక ప్రజల యొక్క వివిధ సమస్యలపైన పోరాటాలు చేస్తూ పూర్తిస్థాయిలో సమస్యలను పరిష్కారం చూపే విధంగా ప్రజలకి మీ ద్వారా నమ్మకం, భరోసా ఇవ్వాలని తెలిపారు.మరియు రానున్న స్థానిక ఎన్నికలలో జనసేన పార్టీ మన మక్తల్ నియోజక వర్గం లో కూడా సత్తా చాటుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, శంకర్, శివ, నరేష్, గోపి,జనార్దన్, మక్తల్ నియోజకవర్గం సీనియర్ నాయకులు గౌడీ బలరెడ్డి , రామన్ గౌడ్ , శివ , భీమేష్ , పవన్ , మహేష్ , నవీన్ గౌడ్ , ఆంజనేయులు పాల్గొన్నారు.

Related Posts

ఉపాధ్యాయులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించటం సరికాదు, డి టి ఎఫ్ నారాయణ పేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హైమావతి,సూర్యచంద్ర.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల పనితీరును పర్యవేక్షించడానికి ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను పర్యవేక్షణ అధికారులుగా నియమించి బాధ్యతలు అప్పగించడం సరికాదని, ఇది విద్యారంగ తిరోగమన…

మాదకద్రవ్యాలకు బానిస కావద్దని, జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, ఎస్సై

మన న్యూస్ నర్వ మండలం:- మాదక ద్రవ్యాలు నిర్మూలన వారోత్సవాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా నర్వ మండలం కల్వాల్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు మరియు మత్తు పదార్థాలు వాటి యొక్క దుష్ఫలితాలు, నిర్మూలన పై అవేర్నెస్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిజెపి నేతలు

రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిజెపి నేతలు

ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు

శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు

సాగు చేస్తున్న గిరిజన రైతులు భూములు కి ప్రభుత్వము పట్టలు ఇవ్వాలి

సాగు చేస్తున్న గిరిజన రైతులు భూములు కి ప్రభుత్వము పట్టలు ఇవ్వాలి