

దుత్తలూరు, మన న్యూస్ : దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో ఉపాధి హామీ పనులలో భారీ అవకతవకలు జరిగినట్లు గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్ ఆర్ జి ఎస్ విజిలెన్స్ అధికారిని విజయలక్ష్మి గ్రామంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్రవాడ గ్రామంలో ఉపాధి హామీ పనులలో భారీ అవకతవకలు జరిగినట్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు,ఉద్యోగస్తులు ఊర్లో లేనివారికి మస్టర్లు వేసి ప్రజలు సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయని అందుకు విచారణ చేపట్టగా కొంతమంది ఊర్లోనే ఉన్నారని చెప్పడం వారు ఊర్లో లేరని కొంతమంది చెప్పడం లాంటివి జరిగాయని పూర్తి విచారణ చేసి కలెక్టర్కు నివేదిక అందిస్తామని తెలిపారు. దుత్తలూరు మండలంలో మొదటి నుండి భారీ అవినీతి ఉపాధి హామీ పనులలో జరుగుతున్న చర్యలు మాత్రం శూన్యమని తగిన ఆధారాలు ఉన్న అధికారులు స్పందించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఊర్లో ఉన్నవారికి పని కల్పించకుండా ఎక్కడో ఉన్నవారికి మస్టర్లు వేసి ఉపాధి హామీ నిధులను స్వాహా చేస్తున్నారని పలువురు ఆరోపించారు. విచారణ సందర్భంగా గ్రామంలో రెండుగా విడిపోయిన ప్రజలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ అధికారుల ముందే ఘర్షణకు దిగడం కోసం మెరుపు. ఉపాధి హామీ సిబ్బంది దుత్తలూరు మండలంలో అక్రమాలకు పాల్పడుతున్న మాట వాస్తవమేనని రాజకీయ అండదండలతో బెదిరింపులకు సైతం దిగుతున్నారని, తగు విచారణ జరిపి జిల్లా స్థాయి అధికారులు న్యాయం చేయాలను కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పంచాయతీ అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది, కూలీలు తదితరులు పాల్గొన్నారు.