

మన న్యూస్, కావలి: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమే చంద్రబాబు లక్ష్యం……..కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డిమన న్యూస్, కావలి, జూన్ 9:రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమే చంద్రబాబు లక్ష్యమని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ను కావలి ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో సన్నీ వంశీ కృష్ణ, అధికారులతో కలిసి వీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ…… భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2047వ సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భం లో ఆంధ్రప్రదేశ్ ప్రగతి, ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి ఆంధ్రప్రదేశ్ ప్రజల మౌలిక సదుపాయాలు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ విద్యా విధానం, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతి అన్నిటిని కలగలిపితే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిపేదానికి భాగంగా ఈరోజున లాంచనంగా స్వర్ణాంధ ఆంధ్రప్రదేశ్ 2047 ని లాంచనంగా ప్రారంభించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజున ఒక డాక్యుమెంట్ రూపొందించి డాక్యుమెంట్ లో దాదాపు 10 అంశాలు, 10 రకాలైనటువంటి పారామీటర్స్ ని తీసుకొని భవిష్యత్తులో ఏ విధంగా ప్రతి డిపార్ట్మెంట్ ని అభివృద్ధి చేస్తే 2047వ సంవత్సరానికి ఇది స్వర్ణాంధ ప్రదేశగా ఏర్పడుతుంది, ఏ విధమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి, ప్రజల ఆటిట్యూడ్ ని ఎలా మార్చాలి, ప్రజల అవసరాలను ఎలా చూడాలి అన్నిటిని కూడా ఈరోజున కావలి ఆర్డిఓ ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గంకు సంబంధించిన డాక్యుమెంట్ ను తయారు చేస్తున్నందుకు ఈ సందర్భంగా వారిని, వారి టీమ్ ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. భవిష్యత్తులో పారిశ్రామికవాడ ప్రగతికి, ఎయిర్పోర్ట్ లకు, హార్బర్, రామాయపట్నం పోర్ట్ ఇలా అన్నిటిని అనుసంధానం చేసుకుంటూ ఇండస్ట్రీ, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్ పరంగా కావలి ప్రగతి పదంలో ముందుకు పోవడానికి వాళ్ళు మంచి డాక్యుమెంట్ తయారు చేస్తారని, వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలిపారు.


