

మన న్యూస్, వాకాడు:తిరుపతి జిల్లా వాకాడు అశోక్ పిల్లర్ సెంటర్ యందు గూడూరు శాసనసభ్యులు పాశిం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఎంపీడీవో సి శ్రీనివాసులు ఆధ్వర్యంలో యోగేంద్ర పై ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సన్నారెడ్డి విజయ శేఖర్ రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, దోసకాయల కృష్ణమూర్తి, తిరుమూరు శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఎంపీడీవో శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు ఈనెల 21న వైజాగ్ లో 5 లక్షల మందితో మన ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో యోగ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారని తెలిపారు అలాగే భారతదేశంలో యోగాను ప్రోత్సహిస్తూ ప్రపంచానికి ఒక దిక్సూచిగా మన దేశం నిలవాలని అలాగే గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకునే విధంగా వైజాగ్ పట్టణంలో 20 కిలోమీటర్లు నిర్వహిస్తున్నారని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు కాటంరెడ్డి రామలింగారెడ్డి, వాకాటి గంగాధర్ రెడ్డి, మైనారిటీ నాయకులు షేక్ రహంతుల్లా, డిప్యూటీ తాసిల్దార్ సందీప్ కుమార్, ఈవో పి ఆర్ డి ఉమామహేశ్వరరావు,ఏపీఎం మాధవి, మరియు అంగన్వాడి వర్కర్స్, సచివాలయ సిబ్బంది అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

