

గొల్లప్రోలు జూన్ 9 మన న్యూస్ : అన్నమయ్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో జరుగుతున్న చిన్నారులకు సర్వోతోముఖ వికాస తరగతులు గొల్లప్రోలు మండలం వన్నెపూడి దుర్గమ్మ అమ్మ వారి ఆలయం వద్ద సర్పంచ్ కంద సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఇక నుండి ప్రతి వారం ఈకార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సర్పంచ్ కంద సుబ్రహ్మణ్యం తెలిపారు.చిన్నారులకు సర్వతోముఖ వికాస తరగతులు క్రమం తప్పకుండా జరుగుతాయని కళాక్షేత్రం నిర్వాహకులు తెలిపారు.తిరుపతి విజయ శంకర స్వామీజీ, మహాశక్తి పీఠం మాతాజీ శ్రీ ప్రసాన్నాంద, అన్నమయ్య కళాక్షేత్రం కాకినాడ జిల్లా అధ్యక్షుడు సానా నూకరాజు,దిడ్డి సునీత, కోనసీమ, ఏలూరు జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.అలాగే వన్నెపూడి గ్రామానికి చెందిన బవిరిశెట్టి రాంబాబు,బవిరిశెట్టి వెంకటేశ్వరరావు,దొడ్డిపట్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.