

గడ్డిఅన్నారం. మన న్యూస్ :- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సుదీర్ఘ స్వప్నం కేసీఆర్ తోనే సాధ్యమైందని ఎల్ బి నగర్ నియోజకవర్గం గడ్డిఅన్నారం డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు జక్కల శ్రీశైలం అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గడ్డిఅన్నారం డివిజన్
అధ్యక్షుడు జక్కల శ్రీశైలం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి,శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా జక్కల శ్రీశైలం మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కోసం కెసిఆర్ 14 సంవత్సరాలు సుదీర్ఘ ఉద్యమ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని అన్నారు. దేశంలోని దాదాపు 36 రాజకీయ పార్టీలతో తెలంగాణ కు జై కొట్టించిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందన్నారు. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కెసిఆర్ పదేళ్ల పాలనలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాయని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు,డివిజన్ అధ్యక్షులు జక్కల శ్రీశైలం,మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, మాజీ కౌన్సిలర్ రమేష్ ముదిరాజ్, రవి చారీ,రవీందర్ రెడ్డి, ప్రదీప్ గౌడ్, కృష్ణ, తిరుపతి,యద శంకర్,బుచ్చయ్య, విక్కి గౌడ్, సమ్మూ రాములు, సాయినాథ్, మల్లేష్,నర్సింహా, అరుణ, లక్ష్మి,అరుంధతి, నాగమణి, వరలక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.