

మన న్యూస్ పాచిపెంట మే 31:-పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన్ కేంద్రం, రస్తాకుంటుబాయి వారి ఆధ్వర్యం లో వికసిత్ కృషి సంకల్ప అభయాన్ కార్యక్రమం పాచిపెంట మండలం లో ని మాతుమురు, విశ్వనాథ పురం, పనుకువలస మూడు గ్రామాలు లో చేపట్టారు. డా. శ్రీనివాస్ రాజు (ఉద్యాన విభాగం ), ఐసీఏ ఆర్ శాస్త్రవేత్త డా.వి.వెంకటేశ్వర్లు, డా.కే. తేజేశ్వర రావు (ఏరువాక కేంద్రం, విజయనగరం), మధుసూదన రావు (ఏ డి ఏ ఈ సాలూరు) ప్రత్యుష (హె ఓ), ఎం. సూర్య నారాయణ , ఏ యం సి చైర్మన్ ఒక బృందం గా ఏర్పడి మాతుమురు గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం అందించే పధకాలు గురించి,భూసార పరీక్షలు వాటి ఉపయోగాలు, వరి, మొక్కజొన్న లో యాజమాన్య పద్దతులు, యాంత్రీకరణ, సమీకృత వ్యవసాయం పంటల మార్పిడి గురించి వివరించారు.డా. అనంత విహారి, డా పూర్ణ బిందు (ఐ సి ఏ ఆర్ శాస్త్రవేత్త), , ఒక బృందం గా ఏర్పడి విశ్వనాథ పురం , గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం అందించే పధకాలు గురించి, ప్రకృతి వ్యవసాయం, వరి లో అధిక దిగుబడి కి మేలైన యాజమాన్య పద్దతులు, కలుపు యాజమాన్యం భూసార పరీక్షలు –ఉపయోగాలు గురించి వివరించారు. డా.జి.అమృత వీణ (కేవీకే) కే.విశ్వనాధ్ రెడ్డి (ఐ సి ఏ ఆర్ శాస్త్రవేత్త), వ్యవసాయ విభాగం నుండి కె.తిరుపతి రావు (ఏ ఒ), శైలజ (వ్యవసాయ విస్తరణా అధికారి )ఒక బృందం గా ఏర్పడిపనుకు వలస గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం అందించే పధకాలు గురించి, వరి లో ఎరువుల యాజమాన్యం, చిరు ధాన్యాలు లో కొత్త రకాలు గురించి, భూసార పరీక్షలు గురించి వివరించారు. రైతులకు భూ ఆరోగ్య కార్డులు నవధాన్య విత్తనాలు పంచారు ఈ సందర్భంగా రైతులు వివిధ పంటలలో ఆశించే చీడపీడలు డ్రోన్ పరిజ్ఞానం గురించి ప్రశ్నలు సంధించారు, ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
