

మన న్యూస్,తిరుపతి :
రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ జూన్ 2వ తేదీ విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పీఏసీ సభ్యులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పిలుపునిచ్చారు.