

కలిగిరి, మన న్యూస్ : మాటల ప్రభుత్వం వైసీపీ ది చేతల ప్రభుత్వం టిడిపి పార్టీది అని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పేర్కొన్నారు. శనివారం కలిగిరి మండలం వీర్నకల్లు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై, పింఛన్ దారులకు ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యే చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ మాట్లాడుతూ, సరిగ్గా సంవత్సరం క్రితం రెండు నెలలు పింఛన్ పంపిణీ చేయలేక జగన్ చతికిల పడ్డాడు అన్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు మూడు వేల పింఛన్ 4000 పెంచడంతోపాటు గత మూడు నెలలది కలిపి 7000 రూపాయలు అందజేసిన ఘనత టిడిపి ప్రభుత్వందే అన్నారు. జూన్ ఒకటో తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్ అందజేయడం జరిగిందన్నారు. ఆరు నెలల కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా గుంతలు పడిన రోడ్లను బాగు చేసిన ఘనత బాబు గారిదే అన్నారు. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు, యువత ఉద్యోగ కల్పనకు అలుపెరగని పోరాట యోధునిగా యువ నాయకుడు మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు శ్రమిస్తున్నారన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తున్నారని తెలిపారు. విజన్ ఉన్న నాయకుడితో కలిసి నడిసి పయనిద్దాం. అని పిలుపునిచ్చారు. గ్రామంలో ఇద్దరు వృద్ధులు పింఛన్ రావడంలేదని తెలుపుగా, వారికి పింఛన్ అంతే విధంగా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కలిగిరి మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు సిమల, తాతయ్య, వెంగప నాయుడు ఎంపీడీవో ప్రత్యూష, కలిగిరి సిఐ వెంకటనారాయణ, రమణారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, తెలుగుదేశం ముఖ్య నాయకులు గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.