ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!3000 నుండి 4000 పెన్షన్ పెంచి అందజేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. మాటల ప్రభుత్వం వైసీపీ -చేతల ప్రభుత్వం టిడిపి,,పింఛన్లు పంచలేక చతికిల పడ్డ జగన్ అంటున్న కాకర్ల…!!!

కలిగిరి, మన న్యూస్ : మాటల ప్రభుత్వం వైసీపీ ది చేతల ప్రభుత్వం టిడిపి పార్టీది అని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పేర్కొన్నారు. శనివారం కలిగిరి మండలం వీర్నకల్లు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై, పింఛన్ దారులకు ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యే చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ మాట్లాడుతూ, సరిగ్గా సంవత్సరం క్రితం రెండు నెలలు పింఛన్ పంపిణీ చేయలేక జగన్ చతికిల పడ్డాడు అన్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు మూడు వేల పింఛన్ 4000 పెంచడంతోపాటు గత మూడు నెలలది కలిపి 7000 రూపాయలు అందజేసిన ఘనత టిడిపి ప్రభుత్వందే అన్నారు. జూన్ ఒకటో తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్ అందజేయడం జరిగిందన్నారు. ఆరు నెలల కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా గుంతలు పడిన రోడ్లను బాగు చేసిన ఘనత బాబు గారిదే అన్నారు. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు, యువత ఉద్యోగ కల్పనకు అలుపెరగని పోరాట యోధునిగా యువ నాయకుడు మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు శ్రమిస్తున్నారన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తున్నారని తెలిపారు. విజన్ ఉన్న నాయకుడితో కలిసి నడిసి పయనిద్దాం. అని పిలుపునిచ్చారు. గ్రామంలో ఇద్దరు వృద్ధులు పింఛన్ రావడంలేదని తెలుపుగా, వారికి పింఛన్ అంతే విధంగా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కలిగిరి మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు సిమల, తాతయ్య, వెంగప నాయుడు ఎంపీడీవో ప్రత్యూష, కలిగిరి సిఐ వెంకటనారాయణ, రమణారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, తెలుగుదేశం ముఖ్య నాయకులు గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.

  • Related Posts

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    గొల్లప్రోలు జూన్ 8 మన న్యూస్ : ఏ పి ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ఏర్పాటు జరిగినట్లు సొసైటీ జనరల్ సెక్రటరీ, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కనిగిరి వెంకట రంగారావు ఒక ప్రకటన లొ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి