శానంపూడి గ్రామ బాలికలకు ప్రతిభకు గుర్తింపు – గురుకుల పాఠశాలలో అడుగు

మన న్యూస్ సింగరాయకొండ:- డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి శానంపూడి గ్రామం అంబేద్కర్ నగర్ కాలనీ, మిట్టమీద పాలెం నుండి ఐదవ తరగతిలో ప్రవేశం పొందిన దాసరి ప్రణీత, వెలిశాల లిఖిత, కంచర్ల అమృత వర్షిణి, దార్ల సంయుక్త, కూతల ప్రదీప్తి అనే ఐదు మంది బాలికలను హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలికలకు విద్యార్థి దశలో తొలి పోటీ పరీక్షగా గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు నిలుస్తాయని, ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు సమతుల్యమైన పౌష్టికాహారం కూడా అందుతుందని తెలిపారు. ఈ సంవత్సరం పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో గురుకుల బాలికలు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచారని గుర్తు చేశారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే కృషి, ఓపిక, దృఢ సంకల్పం అవసరమని సూచించారు.

నాలుగో తరగతి నుంచే బాలికలను గుర్తించి, వారి తల్లిదండ్రులకు గురుకుల పాఠశాల ప్రాముఖ్యత వివరించామని, విద్యాపరంగా ప్రోత్సహిస్తూ స్టడీ మెటీరియల్ పంపిణీ చేసినట్లు తెలిపారు. మధ్యలో విద్యా ప్రమాణాలను పరీక్షించడం వల్ల పోటీ పరీక్షల్లో విజయం సాధించగలిగారని పేర్కొన్నారు. ఈ విజయానికి సహకరించిన శానంపూడి ఉన్నత పాఠశాల అధ్యాపక సిబ్బందికి, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts

అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

మన న్యూస్ కోవూరు:. తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశానుసారం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో ఆదివారం కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ కి తెలుగుదేశం పార్టీ కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్…

రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

మన న్యూస్, కావలి :*నా జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం.*నా గెలుపు కోసం కష్టపడిన ఏ ఒక్కరినీ వదులుకోను.కావలి మున్సిపాలిటీలోని 40 కి 40 వార్డులు కూటమి ప్రభుత్వం గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇద్దామని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు