ప్రతి రైతు ప్రకృతి సాగు చేపట్టాలి -వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్, పాచిపెంట మే 23:– పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులు తమకున్న వ్యవసాయ సాగు భూమిలో కనీసం 15% అయినా సరే పూర్తి స్థాయిలో ప్రకృతి సాగు చేపట్టాలని మిగతా వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయంతో రసాయన వ్యవసాయాన్ని అనుసంధానం చేస్తూ కొనసాగించాలని సాలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నిక కాబడిన ముఖి సూర్యనారాయణ రైతులకు పిలుపునిచ్చారు.తాడూరు గ్రామంలో సి అర్ పి తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గ్రామస్థాయి ప్రకృతి వ్యవసాయ ఖరీఫ్ ప్రణాళిక లో భాగంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రతి రైతు తన కుటుంబ నికి ప్రాధాన్యత నివ్వాలని కనీసం తినే తిండిగింజలు కూరగాయలు తప్పనిసరిగా పురుగుమందులు రసాయన ఎరువులు వెయ్యకుండా పండించుకోవాలని వాటినే వినియోగించుకోవాలని కోరారు.ఆరోగ్యం పాడైన తర్వాత డబ్బు ఖర్చు పెట్టుకునే కంటే ఆరోగ్యం పాడవకుండా ముందుగానే సరి అయిన పోషక ఆహారాన్ని తీసుకోవాలని వ్యవసాయ శాఖ మరియు ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది ఇచ్చిన సూచనలను పాటిస్తూ ముందుకు సాగాలని కోరారు ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమి ఆరోగ్యం తో పాటుగా కుటుంబ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని పోటీ తత్వంతో ఎక్కువ రసాయనాలు వినియోగించకుండా చూడాలని కోరారు వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు, మాట్లాడుతూ భూమిలో 1 % ఉండాల్సిన సారం 0.01 % మాత్రమే ఉందని ఒకపక్క ఎరువుల ధరలు పెరగడమే కాకుండా ఎరువుల తయారీకి కావలసిన ఖనిజ నిలవలు తగ్గిపోతున్నాయని కాబట్టి కేవలం రసాయన వ్యవసాయం మీదే ఆధారపడకుండా ప్రకృతి వ్యవసాయాన్ని రసాయన వ్యవసాయంతో అనుసంధానం చేస్తూ నవధాన్య గణ ద్రవ జీవామృతం కషాయాలు వంటి వాటిని అవసరం మేరకు వాడుతుండాలని తెలిపారు అనంతరం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఉద్దేశంతో రైతులు డి రాము, డి శంకరరావు లను శాలువతో సత్కరించారు.ఈ సందర్భంగా కత్తెర పురుగు మరియు ఇతర పురుగుల నివారణకు అవసరమైన అగ్ని ఆస్త్రాన్ని రైతు దండుపాటి రాము ద్వారా తయారు చేయించి చూపించారు కేవలం 150 రూపాయలతో ఐదు ఎకరాలకు సరిపడా అగ్ని అస్త్రం తయారు. చేసుకోవచ్చని ఇదే రసాయన పురుగుమందులు కొనాలంటే నాలుగు వేల రూపాయల పైనే ఖర్చు అవుతుందని కాబట్టి రైతులందరూ, వ్యవసాయ సిబ్బందిని వినియోగించుకుని అజ్ఞాతరాన్ని తయారు చేయించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు దినేష్ కుమార్ ఎల్ వన్ సూర్యారావు, ఐ సి ఆర్ పి కుమార్ పాల్గొన్నారు.

Related Posts

జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మార్కెట్ సమీపంలో గల జుమా మసీదు కు సంబంధించిన పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని. శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జుమా మసీదు డెవలప్మెంట్ కమిటీ…

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి