ఆత్మ విశ్వాసమే విజయానికి సోపానం……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, నెల్లూరు, మే 8 :- విపిఆర్ ఫౌండేషన్ చే విక్రమ సింహపురి యూనివర్సిటీ అభివృద్ధి పనులకు 15 లక్షల ఆర్ధిక సహాయం.- క్రీడలలో రాణించాలంటే కేవలం శారీరక శక్తి మాత్రమే కాదు, సహనం, తోటి ఆటగాళ్లను కలుపుకుపోయే నాయకత్వం లక్షణాలు అవసరం. – క్రమశిక్షణ, కష్టపడేతత్వం వున్న వారే విజేతలవుతారు.- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.క్రమశిక్షణ, కష్టపడేతత్వం వున్న వారే విజేతలవుతారన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్ బాల్ పోటీలలకు సంబంధించి విజేతలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని విజేతలకు ట్రోఫీలు అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ………క్రీడలలో రాణించాలంటే కేవలం శారీరక శక్తి మాత్రమే కాదు, సహనం, తోటి ఆటగాళ్లను కలుపుకుపోయే నాయకత్వం లక్ష్యణాలు చాలా అవసరమన్నారు. విజేతలుగా ట్రోఫీలు అందుకున్న క్రీడాకారుల ప్రతిభ మరియు అంకితభావానికి దక్కిన గుర్తింపు ఆమె అభివర్ణించారు. కోచ్ ల మార్గ దర్శకత్వం, తల్లి తండ్రుల ప్రోత్సాహంతో పాటు అలుపెరుగని క్రీడాకారుల సాధనే గెలుపు అనే లక్ష్యాన్ని చేరువ చేసిందన్నారు. క్రీడలైనా మరే ఇతర యితర రంగమైనా విజయం సాధించాలంటే క్రమశిక్షణ, కష్టపడే తత్వంతో పాటు గెలవగలం అన్న ఆత్మ విశ్వాసం చాలా అవసరమన్నారు. ఆటలో గెలుపు ఓటములు సహజమన్నారు. ఓటమిని కూడా గౌరవంగా స్వీకరించడమే క్రీడా స్ఫూర్తికి నిదర్శనమన్నారు. విక్రమ సింహపురి యూనివర్సిటి అభివృద్ధి పనుల కోసం విపిఆర్ ఫౌండేషన్ తరుపున ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు 15 లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, విక్రమ సింహపురి యూనివర్సిటి వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ సునీత తదితరులు పాల్గొన్నారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///