వెంగంపల్లి రైతు సేవా కేంద్రంలో స్మార్ట్ వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం

మనన్యూస్ తవనంపల్లె మే 8:- మండలంలోని వెంగంపల్లి గ్రామంలో గల రైతు సేవా కేంద్రం నందు ఈరోజు రైతు స్కిల్ అప్ డిజిటల్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించిన మండల వ్యవసాయ అధికారులు, ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి ప్రవీణ్, వ్యవసాయ విస్తరణ అధికారి లేష్మా, వెంగంపల్లె రైతు సేవ అధికారి జి దీపిక పాల్గొని రైతులకు డిజిటల్ వ్యవసాయ సాధనాలపై అవగాహన కల్పించారు. ఈ శిక్షణలో గ్రామంలోని సుమారు 75 మంది రైతులు పాల్గొని డిజిటల్ వ్యవసాయం దాని లాభనష్టాల గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా స్మార్ట్ ఫోన్ వినియోగం, డిజిటల్ లావాదేవీలు, వ్యవసాయానికి సంబంధించిన అప్ ల ఉపయోగం వంటి అంశాలపై రైతులకు వివరించారు. రైతులు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా నూతన వ్యవసాయ పద్ధతులు, మార్కెట్ సమాచారం ఎలా పొందాలో ప్రాక్టికల్ ట్రైనింగ్ ద్వారా నేర్చుకున్నారు. అంతేకాకుండా పీఎంఎఫ్బివై, పిఎంకెఎస్వై, ఆర్కెవివై, ఎమ్ఐడిహెచ్, పి ఎం ఈజిపి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అలాగే పాడి పరిశ్రమ పథకాలైన రాష్ట్రీయ గోకులం మిషన్, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకాల గురించి వివరించారు. పలు కేంద్ర రాష్ట్ర పథకాలు ఎలా లబ్ధి పొందాలో వాటికి కావాల్సిన అర్హతలు మరియు వాటి నియమ నిబంధనల గురించి తెలియజేశారు. అలాగే వ్యవసాయ రంగంలో పశువుల పాత్ర గురించి కూడా వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి ప్రవీణ్, వ్యవసాయ విస్తరణ అధికారి లేష్మ రైతు సేవా కేంద్రం వెంగంపల్లి ఇంచార్జి జి దీపిక మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!