ప్రతి కార్మికుడికి మెరుగైన జీవనం స్థిరమైన ఆదాయం భద్రత కల్పించడమే టిడిపి లక్ష్యం…రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్

మన న్యూస్,తిరుపతి:- రాష్ట్రంలోని ప్రతి కార్మికుడికి మెరుగైన జీవనంతో పాటు స్థిరమైన ఆదాయం భద్రత కల్పించడమే తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తెలిపారు. రేణిగుంట రోడ్డు లోని టిడిపి పార్లమెంటు కార్యాలయం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎన్టియుసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల దినోత్సవం తెలుగుదేశం పార్టీ గౌరవిస్తుందని, కూలీల కార్మికుల సంక్షేమానికి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారన్నారు. టిడిపి పాలనలో కార్మికుల సంక్షేమం కోసం శ్రామిక భీమా పథకం, కౌలు కార్మికులకు వృత్తి నైపుణ్యాభివృద్ధి శిక్షణ, వృత్తి ఆధారిత ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు. కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని చెప్పారు. నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ కార్యక్రమాలు, కార్మికులకు ఆధునిక వృత్తి నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి దంపూరి భాస్కర్ యాదవ్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, టిడిపి నగర ప్రధాన కార్యదర్శి నైనారు మహేష్ యాదవ్, టిడిపి తిరుపతి పార్లమెంట్ కార్యదర్శి యశ్వంత్ రెడ్డి రవిశంకర్ యాదవ్, చెంబకూరు రాజయ్య, లోకేష్ రెడ్డి అప్ప నాయుడు సుబ్బారావు, సిరి వేలు భారతి, గంధం బాబు, రామారావు పలువురు కార్మికులు పాల్గొన్నారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 2 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

  • By RAHEEM
  • October 29, 2025
  • 3 views
ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్