సివిల్స్ తుది ఫలితాల విడుదల-ఇలా చెక్ చేసుకోండి..!

Mana News :- అఖిల భారత స్థాయి సర్వీసుల్లో అధికారుల ఎంపిక కోసం ఏటా నిర్వహించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో ఈ ఫలితాలను అందుబాటులో ఉంచారు. గతేడాది నిర్వహించిన యూపీఎస్సీ సీఎస్ఈ పరీక్షలో ఎంపికైన 1009 మంది అభ్యర్ధుల పేర్లను వెబ్ సైట్ లలో పీడీఎఫ్ రూపంలో యూపీఎస్సీ అందుబాటులో ఉంచింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ వంటి పలు ప్రతిష్టాత్మక కేంద్ర సర్వీసుల్లో ఎంపిక కోసం నిర్వహించే సీఎస్ఈ పరీక్షలో భాగంగా 1056 పోస్టులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే 1009 మంది మాత్రమే తుది జాబితాకు ఎంపికయ్యారు. వీరి వివరాలను యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in. లో అందుబాటులో ఉంచారు. వీరికి మెరిట్ ఆధారంగా వివిధ అఖిల భారత సర్వీసుల్లో నేరుగా అపాయింట్ మెంట్లు లభించబోతున్నాయి. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా వీరిని ఎంపిక చేశారు. గతేడాది జూన్ 16న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. సెప్టెంబర్ 20-29 వరకూ మెయిన్స్ నిర్వహించారు. అలాగే ఈ ఏడాది జనవరి 7 నుంచి 17వ తేదీ వరకూ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో అఖిల భారత స్ధాయిలో టాపర్ గా శక్తి దూబే నిలిచారు. హర్షిత గోయల్ కు రెండో ర్యాంక్ లభించింది. తెలుగు అభ్యర్ధి సాయి శివానికి 11వ ర్యాంక్ దక్కింది. యూపీఎస్సీ క్యాంపస్‌లోని పరీక్షా హాల్ దగ్గర ఫెసిలిటేషన్ కౌంటర్ అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ పరీక్షలు లేదా నియామకాలకు సంబంధించిన ఏదైనా సమాచారం లేదా స్పష్టతను పని దినాలలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య స్వయంగా లేదా 23385271, 23381125 మరియు 23098543 నంబర్లలో టెలిఫోన్ నంబర్ ద్వారా పొందవచ్చు.ఫలితాలు ప్రకటించిన తేదీ నుండి 15 రోజుల్లోపు మార్కులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని యూపీఎస్సీ తెలిపింది.

Related Posts

మన న్యూస్ ఎఫెక్ట్

మనన్యూస్, వార్తకి స్పందన సమయపాలన పాటిస్తూ మున్సిపల్ అధికారి మనన్యూస్,కామారెడ్డి:పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ శాఖ అకౌంటెంట్ రాములు సమయపాలన పాటించడం లేదు,మన న్యూస్ పత్రికలో ప్రచూరించడంతో వార్తకు స్పందించి మున్సిపల్ కార్యాలయానికి సమయపాలన పాటిస్తున్న అకౌంట్ టెన్త్ రాములు ఈ…

Revanth Reddy Grants Permission To Erect NTR Statue

Mana News:- Nandamuri Mohanakrishna, son of the late Nandamuri Taraka Rama Rao (NTR), along with NTR Literature Committee member Madhusudana Raju and Telangana State Agriculture Minister Tummala Nageswara Rao, met…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి