తిరస్కరణ ఉత్తర్వు చట్టబద్ధం కాదు: హైకోర్టు రిజిస్ట్రార్

ఉరవకొండ,మన న్యూస్:
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలైన దరఖాస్తు తిరస్కరణ ఉత్తర్వు చట్టబద్ధమైనది కాదంటూ, హైకోర్టు రిజిస్ట్రార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉరవకొండ పౌర సమాచార అధికారి ఇచ్చిన తిరస్కరణ ఉత్తర్వులను కొట్టి పారేస్తూ, అభ్యర్థించిన సమాచారాన్ని ఆలస్యం లేకుండా అందించాలని ఆదేశించారు. విడపనకల్ మండలం కొట్టాలపల్లి గ్రామానికి చెందిన కురువ లక్ష్మీనారాయణ, ఉరవకొండ మెజిస్ట్రేట్ కోర్టు పరిధిలోని సూపరిండెంట్ (పౌర సమాచార అధికారి) కి, సమాచార హక్కు చట్టం సెక్షన్ 6(1) ప్రకారం, మూడు అంశాలకు సంబంధించిన వివరాలను కోరుతూ 03-03-2025 నాడు దరఖాస్తు చేశారు. వాటిలో ముఖ్యంగా:

  1. క్రైం నెం. 302/2020 కేసు చార్జ్‌షీట్ ఫైలింగ్ ఆలస్యానికి సంబంధించిన సమాచారం,
  2. ఆలస్యం కారణాలు, సాక్షుల స్టేట్‌మెంట్లు,
  3. చార్జ్‌షీట్ దాఖలు కాల వ్యవధి పై స్పష్టత కోరారు.

అయితే, పౌర సమాచార అధికారి 12-03-2025 నాటికి, “న్యాయ సంబంధిత కేసుల రికార్డులు ఆర్టీఐ ద్వారా ఇవ్వలేము” అంటూ తిరస్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రకారం దరఖాస్తు చేయాల్సిందిగా సూచించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన కురువ లక్ష్మీనారాయణ, హైకోర్టు రిజిస్ట్రార్ (అప్పీల్ అధికారిని) ఆశ్రయించారు. 28-04-2025 నాటికి అప్పీల్ దాఖలు కాగా, రెండు పక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న రిజిస్ట్రార్, తిరస్కరణ ఉత్తర్వు చట్టబద్ధమైనదికాదని తేల్చారు. హైకోర్టు రిజిస్ట్రార్ జారీ చేసిన ఉత్తర్వుల్లో, అభ్యర్థి కోరిన సమాచారాన్ని వెంటనే అందించాలని స్పష్టంగా ఆదేశించారు. ఈ ఉత్తర్వుల మేరకు సత్యం వెలుగులోకి వచ్చిందని కురువ లక్ష్మీనారాయణ ఆనందం వ్యక్తం చేశారు.

Related Posts

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 4 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

  • By JALAIAH
  • September 10, 2025
  • 5 views
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..