

కొండాపురం,మన న్యూస్ ::: మునుపేన్నాడు లేని విధంగా, గ్రామపంచాయతీలలో కమిటీలను ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న టిడిపి నాయకత్వం..! ఒకే రోజు కొండాపురం మండలంలో ఆరు పంచాయతీలలో గ్రామ కమిటీలు ఏర్పాటు,గత 45 సంవత్సరాల చరిత్రను తిరగరాస్తు మునిపెన్నడూ లేని విధంగా గ్రామ కమిటీలను గ్రామపంచాయతీ నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో స్వయంగా పర్యవేక్షిస్తూ కమిటీలను ఏర్పాటు చేయడం పట్ల మండలం మరియు గ్రామ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం కొండాపురం మండలంలోని కొండాపురం, శెట్టిపాలెం, గానుగపెంట, చింతల దేవి, ఉప్పులూరు,గొట్టి గుండాల పాలెం, పంచాయితీల కు సంబంధించి గ్రామ కమిటీలను, సీనియర్లకు ప్రాధాన్యమిస్తూ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలను స్వయంగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పర్యవేక్షించారు. గతంలో మండల నాయకులు చెప్పిన పేర్లను ప్రతిపాదించేవారు. అందుకు భిన్నంగా పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ, పార్టీ ప్రతిష్టకు కృషి చేసిన వారికి ప్రాధాన్యతనిస్తూ, గ్రామస్తుల కోరిక మేరకు కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో మొట్టమొదటిగా కొండాపురం మండలం నుండి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఎమ్మెల్యే స్వయంగా బూతులు వారీగా నాయకులను గుర్తిస్తూ కమిటీలోకి తీసుకోవడం పట్ల ఇటు మండల నాయకత్వం మరియు గ్రామ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కమిటీ ఏర్పాటులో టిడిపి మండల నాయకులు గ్రామ నాయకులు పొలిటికల్ మేనేజర్ మాలేపాటి చైతన్య కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.